డిశ్చార్జ్ అయిన కనికాకు కొత్త చిక్కులు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన ఆమె ఎట్టకేలకు విజయం సాధించించి సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అయితే వరుసగా నాలుగుసార్లు టెస్ట్‌లు చేసినప్పటికీ ఆమెకు నెగిటివ్ రావడం.. ఆ తర్వాత రెండుసార్లు నెగిటివ్ రావడంతో కనికాను డిశ్చా్ర్జ్ చేయడం జరిగింది. ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయినా ఆమెకు చిక్కులు తప్పేలాలేవు.

ఇప్పటికే.. మార్చి 20కు ముందు కనికా పలు పబ్లిక్ పార్టీలకు హాజరైంది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా సరే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఆమె మాత్రం ఆ ఆదేశాలను లెక్కచేయకుండా తిరిగిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కనికా కపూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాతే ఆమె ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. అయితే.. 14 రోజులు ముగిసిన తర్వాత పాత కేసులో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారని సమాచారం.

ప్రభుత్వ అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం, ప్రాణాంతక వ్యాధిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించడం లాంటి చర్యలపై ఆమెను ప్రశ్నించనున్నారు. అంతేకాదు.. గతంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఆమెపై యూపీలోని లక్నో పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో 14 రోజుల తర్వాత ఆమెను పోలీసులు విచారించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

More News

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అని రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో అస్సలు తిరగకండి!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో.

లాక్‌డౌన్ పొడిగింపు పక్కా.. IRCTC సంకేతాలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి మార్చి 24 నుంచి ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం విదితమే.

ఒక్కరోజే ఇండియాలో 32 మంది మృతి.. 773 కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో కూడా దీనిప్రభావం గట్టిగానే పడింది. రోజురోజుకు కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).