టాలీవుడ్‌కు శుభవార్త .. ఏపీలో అందుబాటులోకి కొత్త టికెట్ ధరలు, త్వరలోనే జీవో

  • IndiaGlitz, [Friday,February 11 2022]

గడిచిన కొన్ని నెలలుగా టాలీవుడ్‌కు - ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న టికెట్ ధరల పెంపు, థియేటర్‌ల సమస్యలకు చెక్ పెట్టేందుకు సినీ ప్రముఖులు కీలక ముందడుగు వేశారు. దీనిలో భాగంగా గురువారం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ సెలబ్రిటీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సినీ రంగ సమస్యలపై కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా శుభవార్త వింటామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే కొత్త టికెట్ ధరలంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిన్న ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు ప్రతిపాదించిన ధరలను పరిశీలిస్తే... నగరపాలక సంస్థల పరిధిలో వున్న మల్టీప్లెక్సుల ధర రూ 150 గా.. ఏసీ థియేటర్లలో కనిష్ట ధర రూ. 70 కాగా... గరిష్టం రూ. 100 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏసీ లేని థియేటర్లలో కనిష్టంగా రూ 40 , గరిష్ట ధర రూ. 60 గా నిర్ణయించారు. పురపాలక సంఘాల పరిధిలో మల్టీప్లెక్సుల ధర రూ 125గా నిర్ణయించారు.

ఏసీ థియేటర్లలో మినిమం టిక్కెట్ ధర రూ 60 గా... గరిష్ఠ ధర రూ 80 గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏసీ లేని థియేటర్లలో కనిష్ఠ ధర రూ 30... గరిష్ఠ ధర రూ 50గా నిర్ణయించారు. అదే విధంగా నగర పంచాయితీల్లోని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ. 100 గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో కనిష్ట ధర రూ 50 గా, గరిష్టంగా రూ 70 గా ఫిక్స్ చేసారు. ఏసీ లేని థియేటర్లలో కనిష్ట ధర రూ 20 కాగా, గరిష్ట ధర రూ 40 గా ఖరారు చేసినట్లు సమాచారం.

More News

మీ భరోసాతో ఉత్సాహంగా ముందుకెళ్తాం: జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

నెమ్మదిగా వచ్చేయండి.. విశాఖలోనూ జూబ్లీహిల్స్ క్రియేట్ చేద్దాం, టాలీవుడ్‌కు జగన్ వరాలు

టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల, ఈ నెల 18న సినిమా రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".

జ‌గ‌న్‌తో ముగిసిన భేటీ.. చిరంజీవికి థ్యాంక్స్, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు: మ‌హేశ్ బాబు

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ..

సీఎం పర్యటన.. విశాఖలో జనానికి ‘‘ట్రాఫిక్’’ కష్టాలు.. పోలీసులపై జగన్ ఆగ్రహం

బుధవారం విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.