సంజయ్ దత్ తాజా పిక్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

  • IndiaGlitz, [Monday,October 05 2020]

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు చెందిన తాజా పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎప్పుడూ చాలా హుషారుగా.. ఆరోగ్యంగా కనిపించే ఆయన చాలా బలహీనంగా కనిపించారు. కొంతకాలంగా సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంజయ్ దత్ ఎయిర్‌పోర్టులో అభిమానులకు కనిపించారు. వెంటనే ఓ అభిమాని ఆయనతో ఫోటో తీసుకున్నారు. దానిని సోషల్ మీడియాలో సదరు అభిమాని పోస్ట్ చేశారు.

ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోటోలో సంజయ్ దత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆయనను ఎంతలా ఇబ్బంది పెడుతోందో ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. గతంలో ఆయన జైలు జీవితం గడిపిన సమయంలో కూడా చాలా యాక్టివ్‌గానే కనిపించారు. కానీ ఇప్పుడు చాలా వీక్‌గా కనిపించడంతో పాటు.. చాలా వెయిట్ లాస్ కూడా అయ్యారు. సంజయ్ దత్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బాబా త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

తన ఆరోగ్య విషయమై తొలిసారిగా ఆగస్ట్ 11న సంజయ్ దత్ ట్వీట్ చేశారు. దానిలో తనకు ఆరోగ్యం బాగోలేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. ముంబైలో ఫస్ట్ ఫేజ్ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. కీమో థెరపీ పూర్తయిన అనంతరం భార్య మాన్యతతో కలిసి దుబాయి వెళ్లి అక్కడే ఉన్న తమ పిల్లలతో కొద్ది రోజుల పాటు గడిపి తిరిగి ముంబై చేరుకున్నారు. త్వరలోనే సంజయ్ దత్‌కు రెండో దశ కీమో థెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలన్న అభిమానుల ఆకాంక్ష ఫలించి ఆయన త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఆశిద్దాం.

More News

ఎమ్మెల్సీ బరిలో జర్నలిస్టులు..

జర్నలిస్టులు రాజకీయరంగ ప్రవేశం చేయడమనేది కొత్తేమీ కాదు... కానీ ఎమ్మెల్సీ బరిలో ఈ స్థాయిలో పోటీ చేయడమే ఇప్పటి వరకూ జరిగి ఉండకపోవచ్చు.

ఈ వారమైనా భజన ఆపుతారా?

బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభమైన తొలి వారం ఈ షో ఏంటి? అసలు ముక్కూ మొహం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టి వీళ్లేం సాధించాలని అనుకుంటున్నారు?

అమెరికాకు మహేష్.. 45 రోజులు అక్కడే..

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన చిత్ర పరిశ్రమ.. కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు...

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

బుడ్డోడి డ్యాన్స్‌కు కేటీఆర్ ఫిదా.. నెటిజన్లు ఫైర్..!

సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో మంత్రి కేటీఆర్ ఒకరు.