'నేను లోకల్' సెన్సార్ పూర్తయింది

  • IndiaGlitz, [Monday,January 30 2017]

నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నేను లోక‌ల్‌'.'యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌' అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను అందించారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - '' మా 'నేను లోకల్'సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు మా చిత్రానికి యు/ఎ ను అందించారు. ఈ చిత్రంతో నానికి రెండు హ్యాట్రిక్‌లు పూర్త‌వుతాయి. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ అయిన ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన సైడ్ సైడ్ పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు.
ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు. ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. మా సంస్థ నుంచి వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటార‌ని తెలుసు. వారి అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మేం 'నేను లోక‌ల్‌'ను తెర‌కెక్కించాం'' అన్నారు.
నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర పోషించారు.
ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన.

More News

ఫిబ్రవరి 3న లవ్ లీ క్రైమ్ థ్రిల్లర్ కనుపాప విడుదల

మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్.

33 స్టూడియోల్లో బాహుబలి 2..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.

క్రేజీ డైరెక్టర్ పూరి ఆవిష్కరించిన 'ఓ పిల్లా నీవల్లా' మోషన్ పోస్టర్

కిషోర్ స్వీయ దర్శకత్వంలో ..కృష్ణచైతన్య,రాజేష్ రాథోడ్,మోనికా సింగ్,షాలు చారసియా నటీనటులుగా బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం 'ఓ పిల్లా నీ వల్లా'.

అందరి ఆశీస్సుల తో గుంటూరోడు గొప్ప విజయం సాధించాలి - మోహన్ బాబు

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ &బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ జంటగా S.K.సత్య తెరకెక్కించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరోడు.

అమ్మే నా కూతురు అయ్యింది - నాగార్జున

అక్కినేని నాగ చైతన్య - సమంత గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.