'నేనోరకం' టీజర్ టాక్...

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది .త్వరలో ఈ సినిమా పాటలను విడుదల చెయనున్నారు.. ఈసందర్బంగా ..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. నేనోరకం అనే టైటిల్ ఈ సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది.ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..

శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.నేనోరకం సైతం అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్.మా సినిమా టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

దర్శకుడు మాట్లాడుతూ.. నేనోరకం టీజర్ కు మేము ఊహించిన దాని కంటే మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ లభించాయి.సినిమా సైతం టైటిల్ కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్ మెంట్ తో రూపొందించటం జరిగింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను అందించే చిత్రమిదని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... సినిమా టీజర్ కు రెస్పాన్స్ బాగుంది.త్వరలొనె పాటలను విడుదల చెయనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా మరియు టైటిల్ ను సిద్దం చేయటం జరిగింది. రాధిక శరత్ కుమార్ గారు తమిళ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెసెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్ర విజయంపై 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..

More News

పవన్ తో మూడోసారీ మార్చేసాడు

పవన్ కళ్యాణ్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న తొలి దర్శకుడుగా క్రెడిట్ సొంతం చేసుకున్నాడు

'ఆర్య' వన్ సైడ్ లవ్ కి 12 ఏళ్లు

వన్ సైడ్ లవ్ లోని గొప్పతనాన్ని చెబుతూ ప్రేక్షకులకి సరికొత్త ప్రేమకథని పరిచయం చేసిన చిత్రం 'ఆర్య'.

డబ్బింగ్ చెబుతున్న 'జెంటిల్ మన్'

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెంటిల్ మన్'.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.'అష్టా చమ్మా' తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది.

బ్ర‌హ్మోత్స‌వం సాంగ్ మేకింగ్ రిలీజ్...

సూపర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నభారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మిస్తుంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను ఈనెల 7న రిలీజ్ చేస్తున్నారు.

బాహుబలి మాయలో కుర్రహీరో

'వినవయ్యా రామయ్య'ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమాకు రంగం సిద్దమైంది.ఎంతో కాలంగా సరైన కథ కోసం ఎదురుచూసిన అన్వేష్ చివరకు ఓ కథను ఒకే చేసి ఆరు నెలలుగా దాని పై వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.