హిందూ మనోభావాలను గౌరవిస్తాము..నాకు నేనే తోపు తురుమ్ : నిర్మాత ధృవ కుమార్

  • IndiaGlitz, [Friday,July 28 2017]

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటించిన చిత్రం 'నాకు నేనే తోపు తురుమ్'. దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది.
ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ హిందూ జనశక్తి సంస్థ చెప్పింది. అయితే తమకు ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని చిత్ర నిర్మాత ధృవ కుమార్ తెలిపారు. అలా భావించిన వారికి క్షమాపణలు చెప్పారు.
నిర్మాత ధృవ కుమార్ మాట్లాడుతూ ... ''హిందూ మతం అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఏ మతాన్ని కించపరిచేలా సినిమా ఉండదు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్ధంతో బతుకుతున్నారు. ధర్మం అనేది లేకుండా పోయింది అనే విషయాన్ని కొంత అగ్రెసివ్ గా చెబుతూ ప్రచారం చేశాం. మాకు తెలియకుండానే ఎవరైనా నొప్పిస్తే క్షమాపణ కోరుతున్నాను. ఈ విషయం మా దృష్టికి తీసుకుని వచ్చిన హిందూ జనశక్తి సంస్థకు, సంస్థ అధ్యక్షుడు లలిత్ కుమార్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అన్నారు.

More News

'ఫిదా' సంబరాలు

యంగ్ హీరో వరుణ్ తేజ్,సాయిపల్లవి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై

నిర్మాత కొడుకుతో జత కడుతున్న శివాని...

జీవిత, రాజశేఖర్ దంపతుల తనయ శివాని త్వరలోనే తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ విషయమై అధికారక సమాచారం కూడా వచ్చింది.

పాట పాడబోతున్న విష్ణు..?

మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న చిత్రం `వోటర్`. అడ్డా ఫేమ్ జి.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ఓ పాటను మంచు విష్ణు పాడబోతున్నాడని సమాచారం.

జూలై 31న 'జయ జానకి నాయకి' ఆడియో విడుదల!!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక".

బాలీవుడ్ రీమేక్ లో ధనుష్...

తమిళ హీరో ధనుష్కు బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో ధనుష్ తమిళంలో రాంజాన్, షమితాబ్ చిత్రాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు ధనుష్కి బాలీవుడ్లో మంచి పేరునే తీసుకొచ్చాయి.