Modi: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది: ప్రధాని మోదీ

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ మే 13న జరగబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక జరగనుంది. నేటితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ముగుస్తుంది. దీంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొన్నటి వరకు రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొన్న పార్టీల అధినేతలు.. ఇప్పుడు మీడియా ఛానల్స్‌కు ఇంటర్వూస్ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తొలిసారి ఓ తెలుగు ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. టీడీపీ, జనసేన ఎన్డీఏలో ఉన్నాయి కదా.. జగన్ మీతో ఉన్నట్లా.. లేనట్లా..? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఏపీలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.

ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగలేదు.. ఆ ప్రభావం కిందవరకు వెళ్లింది. జగన్ ఎప్పుడూ మాకు రాజకీయ మిత్రపక్షం కాదు. పార్లమెంట్‌లో కీలకమైన బిల్లుల విషయంలో సందర్భాన్ని బట్టి మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో జగన్‌ను మా ప్రత్యర్థిగానే కొట్లాడం. ఆయన ఓ రాష్ట్ర సీఎం.. నేను దేశ ప్రధాని. ప్రధాని హోదాలో రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీయైనా.. ఏ రాష్ట్రమైనా నా తోడ్పాటు ఉంటుంది. ఏపీకి కూడా కేంద్రం తరపున చేయాల్సింది చేశాం. దేశంలో ప్రతి రాష్ట్రానికి తోడ్పాటు అందించడం మా బాధ్యత.

టీడీపీ గతంలోనే ఎన్డీఏలో భాగంగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా మాతో కలిసి వస్తోంది. జనాల మద్దతు చూస్తుంటే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని పక్కాగా భావిస్తున్నాను. అలాగే ఎంపీ సీట్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలుస్తామని నమ్మకం ఉంది అని తెలిపారు. దీంతో ఏపీలో టీడీపీ కూటమి విజయం ఖాయమని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా కూటమిలో బీజేపీ చేరిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి మూడు సార్లు ప్రచారానికి వచ్చారు. మొత్తం నాలుగు సభలతో పాటు విజయవాడలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో కలిసి భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఇక సభల్లో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ గూండాలకు పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.

More News

నా భార్యను క్షమించమని అడిగాను: పవన్ కల్యాణ్‌

గత పదేళ్ల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నానని.. ధర్మో రక్షతి రక్షితః అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. పిఠాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు టీజీ సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్

ఏపీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

CM Jagan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు

Sharmila: సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో షర్మిల కంటతడి

షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కంటతడి పెట్టారు.

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. మధ్యంతర బెయిల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో అరెస్టైన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.