Balayya:బాలయ్యతో 'యానిమల్' వైల్డెస్డ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది..

  • IndiaGlitz, [Saturday,November 18 2023]

'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్‌ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేస్తున్న ఈ షో మూడవ సీజన్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో 'భగవంత్ కేసరి' మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల ఈ షోలో పాల్గొని సందడి చేశారు. తాజాగా 'యానిమల్' మూవీ టీమ్ ఈ షోలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఆహా సంస్థ విడుదల చేసింది.

ఈ ప్రోమోలో బాలయ్య బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో కలిసి రచ్చ చేశారు. డ్యాన్సులు వేస్తూ, సరదా ప్రశ్నలు వేస్తూ హల్‌చల్ చేశారు. అంతేకాకుండా రష్మికతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకి కాల్ చేయించి ఆట పట్టించారు. ప్రోమోలోనే ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఫుల్‌ ఎపిసోడ్‌లో ఇంకెత ఫన్ ఉండనుందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 24న ఈ వైల్డ్ ఎపిసోడ్ ఆహాలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది.

ఇక గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేశ్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా నటించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలపై భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే కథతో 'యానిమల్' చిత్రం ఉండబోతున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని భావించినా.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 1న రిలీజ్ చేస్తు్న్నారు.

More News

MLC Kavitha:తీవ్ర అస్వస్థతతో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు.

Nani:రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని.. ఎందుకంటే..?

తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఏ గల్లీ చూసినా పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది.

Vijayashanthi:కాంగ్రెస్‌లో అలా చేరారో లేదో.. విజయశాంతికి కీలక బాధ్యతలు..

మాజీ ఎంపీ విజయశాంతి నిన్న(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదో ఇవాళ ఆమెకు కీలక పదవి అప్పగించారు.

Purandeswari:ఏపీలో జనసేన-బీజేపీ కలిపి పోటీ చేస్తాయి: పురదేంశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.

Vijayashanthi:కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు..

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు.