అనుష్కలాగే నయన కూడా..

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

టాలీవుడ్‌లో అనుష్క హీరోయిన్ ఓరియెంటెండ్ మూవీస్‌తో దూసుకుపోతుంటే.. కోలీవుడ్‌లో న‌య‌న‌తార ఈ త‌ర‌హా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటున్నారు. అలాగే అనుష్క హిట్ చిత్రాలు త‌మిళంలోకి డ‌బ్ అయిన‌ట్టే.. న‌య‌న‌తార హిట్ చిత్రాలు తెలుగులోకి అనువాద‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే 'భాగ‌మ‌తి' చిత్రంతో అనుష్క బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా వసూళ్ళ ప‌రంగా మెప్పించింది. పొలిటిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో చంచ‌ల అనే క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించారు అనుష్క‌.

క‌ట్ చేస్తే.. అనుష్క లాగే న‌య‌న‌తార కూడా క‌లెక్ట‌ర్‌గా సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్న 'క‌ర్త‌వ్యం' అనే త‌మిళ అనువాద చిత్రంలో న‌య‌న‌తార క‌లెక్ట‌ర్ మ‌ధువ‌ర్షిణిగా క‌నిపించ‌నున్నారు. మ‌రి అనుష్క లాగే న‌య‌న‌తార కూడా క‌లెక్ట‌ర్ పాత్ర‌తో విజ‌యాన్ని సొంతం చేసుకుంటారో లేదో చూడాలి. త‌మిళ‌నాట 'అర‌మ్' పేరుతో విడుద‌లైన 'క‌ర్త‌వ్యం' విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విజ‌యాన్ని కూడా సొంతం చేసుకుంది.

More News

నితిన్ బాటలోనే రామ్

ఎవరైనా సక్సెస్ ఇచ్చిన కాంబినేషన్ తోనే వరుసగా రెండో సినిమా కూడా చేస్తారు.

ఆ రీమేక్ కు ముహుర్తం కుదిరిందా?

అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్,అలియా భట్ జంటగా నటించిన హిందీ చిత్రం '2స్టేట్స్'.

భ‌ర‌త్ అనే నేను.. ఆ రెండూ కీల‌క‌మే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌మైక్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్న చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

20వ కళాసుధ అవార్డుల ప్రధానం

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం'.. ఉగాది సంద‌ర్బంగా మార్చి 16న విడుద‌ల

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ