నా కెరీర్ లోనే డిఫరెంట్ రోల్ - నయనతార

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

'చంద్రకళ', 'పిశాచి', 'ఉత్తమవిలన్‌', రీసెంట్‌గా 'జ్యోతిలక్ష్మీ' వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ తాజాగా నయనతార ప్రధాన పాత్రలో 'మయూరి' చిత్రాన్ని నిర్మించారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. అండ్‌ శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు నిర్మిస్తోన్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 17న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా హీరోయిన్‌ నయనతార మాట్లాడుతూ - ''నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'మయూరి' నా కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ రోల్‌. నా కెరీర్‌లో ఇది నాకు ఛాలెంజింగ్‌ రోల్‌. సబ్జెక్ట్‌ నేరేట్‌ చేసినపుడే నేను చాలా థ్రిల్‌ అయ్యాను. టేకింగ్‌లో ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా తీసారు డైరెక్టర్‌ అశ్విన్‌ శరవణన్‌. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో తీశారు. నా కెరీర్‌లో నాకు మంచి శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చిన సినిమా ఇది. కమర్షియల్‌గా కూడా చాలా పెద్ద రేంజ్‌లో హిట్‌ అయ్యే సినిమా 'మయూరి'. తెలుగులో చంద్రముఖి, గజిని, లక్ష్మీ, తులసి, సింహా, అదుర్స్‌, శ్రీరామరాజ్యం చిత్రాల తర్వాత నాకు మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది 'మయూరి'' అన్నారు.

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 17న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. బిజినెస్‌ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతోంది. 'మయూరి' మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ బేనర్స్‌పై నిర్మాణం జరుపుకుంటున్న 'మయూరి' చిత్రంలో ఆరి, అంజాద్‌ఖాన్‌, మైమ్‌ గోపి, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్‌, శరత్‌ మిగతా ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌, సంగీతం: రాన్‌ ఎథన్‌ యోహాన్‌, ఎడిటింగ్‌: టి.ఎస్‌.సురేష్‌, ఆర్ట్‌: రామలింగం, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: ఆశ్విన్‌ శరవణన్‌.

More News

సెప్టెంబర్ 18న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.

ఐదు భాషల్లో...తెలుగులో రామ్ చరణ్ చేస్తున్నాడా..?

ఇటీవల తమిళంలో జయం రవి, నయనతార హీరో హీరోయిన్లుగా మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘తని ఒరువన్’(ఒకే ఒక్కడు అనే అర్థం వస్తుంది).

బ‌న్ని బాగానే ఉన్నాడంటున్న అల్లు అర‌వింద్..

బ‌న్నికి యాక్సిడెంట్ అయ్యింది. ఇది టుడే లేటెస్ట్ పుకారు. ఇంకేముంది బ‌న్నికి యాక్సిడెంట్ జ‌రిగింద‌ట అంటూ న్యూస్ ఛాన‌ల్స్ లో ఒక‌టే హ‌డావిడి.

గణేషుడి ఎదుట బాలయ్య పాట...

నందమూరి నట సింహాం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

బన్నికి యాక్సిడెంట్ అయ్యిందా...?

బన్ని... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.