మొత్తానికి న‌య‌న‌తార సినిమా వ‌స్తోంది

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

'వ‌ల్ల‌భ' వంటి వివాద‌స్ప‌ద చిత్రం త‌రువాత శింబు, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'ఇదు న‌మ్మ ఆళు'. తొమ్మిదేళ్ల త‌రువాత వీరి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. ఎప్పుడో ప్రారంభ‌మైన ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదాల ప‌ద్ధ‌తిలో చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది.

ఇక ఒకే ఒక్క పాట షూట్ చేయాల్సి ఉంది ఈ సినిమా కోసం. అది కూడా న‌య‌న క‌నిక‌రిస్తే.. వెంట‌నే పూర్త‌వుతుంద‌ట‌. ప్ర‌స్తుతం న‌య‌న హ్యాట్రిక్ విజ‌యాల‌తో త‌మిళనాట నెం.1 హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఊపులోనే 'ఇదు నమ్మ ఆళు'ని కూడా విడుద‌ల చేస్తే ఆ క్రేజ్‌ని ఉప‌యోగించుకున్న‌ట్ల‌వుతుంద‌ని శింబు అండ్ కో ఆలోచిస్తోంద‌ట‌. దీపావ‌ళికి ఆడియోని.. క్రిస్మ‌స్‌కి సినిమాని విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

More News

'ఎక్స్‌ప్రెస్ రాజా'కి అన్నీ ప్ల‌స్‌లే..

కొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లోనే క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో.. శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని కూడా చేర్చుకోవ‌చ్చు.

శ్రుతి హాస‌న్‌ని డామినేట్ చేసేలా..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రుతి హాస‌న్‌. ఈ దీపావ‌ళికి అజిత్‌తో న‌టించిన త‌మిళ చిత్రం 'వేదాళ‌మ్'తో త‌న మాతృభాష ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది శ్రుతి.

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న స్వాతి

అందం, అభిన‌యం.. ఈ రెండూ మెండుగా ఉన్న తెలుగమ్మాయి స్వాతి.. అతి త్వ‌ర‌లో 'త్రిపుర‌'గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

ప్ర‌దీప్ తో ఫైట్ చేస్తున్న బ‌న్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

సిమ్రాన్ అండ్ స‌న్స్ స్టార్ట్..

చిరంజీవి, బాల‌క్రిష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్...ఇలా టాలీవుడ్ టాప్ హీరోస్ స‌ర‌స‌న న‌టించి స‌క్సెస్ సాధించిన సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్.