మ‌రో హ‌ర్ర‌ర్ మూవీ చేస్తున్న అందాల తార‌..

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

ఇటీవ‌ల హ‌ర్ర‌ర్ మూవీతో ఆక‌ట్టుకున్నఅందాల తార... మ‌రో హ‌ర్ర‌ర్ మూవీతో అల‌రించేందుకు రెడీ అవుతుంది. ఇంత‌కీ ఆ అందాల తార ఎవ‌ర‌నుకుంటున్నారా..? న‌య‌న‌తార‌. ఇటీవ‌ల త‌మిళ్ లో మాయ టైటిల్ తో న‌య‌న‌తార చేసిన హ‌ర్ర‌ర్ మూవీ తెలుగులో మ‌యూరి పేరుతో రిలీజైంది. మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు న‌య‌న‌తార మ‌రో హ‌ర్ర‌ర్ మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌.

దాస్ రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీని ఎ.స‌ద్గుణం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో న‌టించే న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే ఎంపిక చేయ‌నున్నారు. న‌య‌న‌తార న‌టించిన హ‌ర్ర‌ర్ మూవీ మ‌యూరి ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీ పై ప్రారంభం నుంచి అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. మ‌రి..న‌య‌న్ లేటెస్ట్ హ‌ర్ర‌ర్ తో కూడా ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి భ‌య‌పెట్టి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

More News

మెగా హీరో ఫంక్షన్ కు ప్రభాస్..

బాహుబలి పార్ట్ 1తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వేరే సినిమా చేయకుండా బాహుబలి 2 కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు.

చెన్నై వరద బాధితులకు 3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన వరుణ్ తేజ్

ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచయం చేస్తున్న ర‌వితేజ‌

కెరీర్ తొలినాళ్ళ నుండి కొత్త ద‌ర్శ‌కుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ర‌వితేజ త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ద‌ర్శ‌కుడిని తెలుగు తెర‌కు ప‌రిచయం చేయ‌నున్నాడు.

ఆ డైరెక్ట‌ర్ కి మ‌హేష్ మాటిచ్చాడ‌ట‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుది.

చెన్నైప్రజలకు తారల చేయూత

చెన్నైలో కురుస్తున్న వర్షాలకు జనం నానా అవస్థలు పడుతున్నారు.గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమై సేవా కార్యక్రమాలు చేపట్టింది.