విక్రమ్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఇదే..

  • IndiaGlitz, [Wednesday,July 27 2016]

త‌మిళ హీరో విక్ర‌మ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఇరు ముగ‌న్. ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని తెలుగులో ఇంకొక్క‌డు అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో న‌య‌న‌తార పోలీస్ అధికారిణిగా న‌టిస్తుండ‌డం విశేషం.
ఇలాంటి ప‌వ‌ర్ ఫుల్ రోల్ కోసం చాలా రోజులు నుంచి ఎదురు చూస్తుంద‌ట‌. అందుక‌నే డైరెక్ట‌ర్ ఆనంద్ శంక‌ర్ క‌థ చెప్పిన వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. లేడీ అమితాబ్ విజ‌య‌శాంతిని గుర్తు చేసేలా న‌య‌న‌తార క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ మూవీతో న‌య‌న‌తార‌కు కొత్త ఇమేజ్ వ‌స్తుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ ను ద‌క్షిణాది హీరోల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.