ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న న‌వీన్‌చంద్ర చిత్రం

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రంలో నవీన్‌చంద్ర హీరోగా చేస్తున్నాడు.

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పించే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూలై 18 నుండి నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని ఆశించే సినిమా ఇది. అన్ని క్యారెక్టర్స్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేలా సినిమాను రూపొందిస్తున్నార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈరోజుతో సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దీంతో సినిమా 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఆగ‌స్ట్ 16 నుండి రెండో షెడ్యూల్ ప్రారంభించి చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తార‌ని స‌మాచారం.