డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్న ధనుష్ 'నవమన్మథుడు'

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో రాణిస్తూ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన మాస్, కమర్షియల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నధ‌నుష్ హీరోగా స‌మంత‌, ఎమీజాక్స‌న్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం తంగ మ‌గ‌న్‌'. ఈ చిత్రాన్ని'న‌వ‌మ‌న్మ‌థుడు' అనే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. డి.ప్ర‌తాప్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బృందావ‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. వేల్ రాజ్ ద‌ర్శ‌కుడు. ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్ నిర్మాత‌లు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ..

చిత్ర నిర్మాత‌లు ఎన్‌.వెంక‌టేష్‌, ఎన్‌.ర‌వికాంత్ మాట్లాడుతూ 'ధ‌నుష్ విల‌క్ష‌ణ‌మైన హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శించే హీరో. త‌మిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. గ‌తంలో ధ‌నుష్‌తో ర‌ఘువ‌ర‌న్ బి.టెక్(త‌మిళంలో వేలై ఇల్లాద ప‌ట్ట‌దారి) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన వేల్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ల‌వ్‌, యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా సినిమా రూపొందింది. యువ సంగీత కెర‌టం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఆడియో డిసెంబ‌ర్ 11న విడుద‌ల‌వుతుంది. అలాగే సినిమాను డిసెంబ‌ర్ 18న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

ధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః అనిరుధ్ ర‌విచంద్రన్, కెమెరాః ఎ.కుమర‌న్‌, ఎడిటింగ్ః ఎం.వి.రాజేష్‌కుమార్‌, స‌హ నిర్మాత‌లుః ఎం.డి.ఎం.ఆంజ‌నేయ‌రెడ్డి, కె.య‌స్‌.రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః వేల్‌రాజ్‌.

More News

ప్రభాస్ కి కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్స్...

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్యఅతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయి..

బాలీవుడ్ లో డిక్టేటర్...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

పవన్ ప్రొడ్యూసర్ కి కోపం వచ్చింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు.

అదే లోఫర్ సక్సెస్ అంటున్న పూరి

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..తెరకెక్కించిన తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా నటించారు.

చిరంజీవి రాకపోవడానికి రీజన్ అదేనట...

మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పుడు ఆరడజను మంది హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.