నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ గుండెపోటుతో మృతి

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేస్తూ ఆయన సస్పెండైన విషయం తెలిసిందే. గత ఏడాది కరోనా సమయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన హాట్ టాపిక్‌గా మారారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న తమకు ఎన్‌ 95 మాస్కులు ఇవ్వడం లేదని, పీపీఈ కిట్లు లేవని ఆరోపించారు. దీంతో వృత్తి పరమైన నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ప్రభుత్వం ఏప్రిల్‌ 8న ఆయనను సస్పెండ్‌ చేసింది. దీనిపై డాక్టర్‌ సుధాకర్‌ తీవ్ర మనస్తాపం చెందారు.

ఇదీ చదవండి:  ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. అనంతరం కూడా ఆయన విషయం సంచలనంగానే మారింది. గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ డాక్టర్‌ సుధాకర్‌ను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆ సమయంలో కొట్టడం, చేతులు విరిచికట్టడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. సుధాకర్‌ మతిస్థిమితం కోల్పోయారని చెప్పి పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్‌కు మానసిక స్థితి సరిగా లేదని చెప్పి మానసిక వైద్యశాలకు తరలించడంపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి..

ఈ నెలలోనే తీర్పు రావలసి వుంది. దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకే సుధాకర్‌ బలయ్యారని, సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. డాక్టర్‌ సుధాకర్‌ హఠాన్మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం డాక్టర్ సుధాకర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

More News

విషాదం : నిర్మాత బీఏ రాజు మృతి

టాలీవుడ్ లో మరో దుర్ఘటన జరిగింది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బీ ఏ రాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ ఈ ఉదయం మెల్కోవలసి వచ్చింది.

నాని 'శ్యామ్ సింగ రాయ్'కి భారీ నష్టం.. ఎంత పని జరిగింది!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ భారీ నష్టాలు ఎదుర్కొంటోంది. కోట్లాది రూపాలు ఖర్చు చేసి నిర్మించిన చిత్రాలు విడుదలకు నోచుకోకుండా పోయాయి.

వీధుల్లో తిరుగుతున్న సూపర్ స్టార్.. ట్రెండింగ్ లో ఫొటోస్

సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. వీలైనంతగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం

ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

కోవిడ్ ఎఫెక్ట్ : రూల్స్ అతిక్రమిస్తే అంతే.. బిగ్ బాస్ సెట్ సీల్!

కరోనా విలయతాండవానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనితో అవసరమైన చోట్ల ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నాయి.