నారా రోహిత్ న్యూయర్ ప్లాన్స్..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న యువ హీరో నారా రోహిత్. ఈ సంవ‌త్స‌రంలో ఓ నాలుగైదు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నారా రోహిత్ ఈ ఏడాది చివ‌రిలో అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రాన్ని త‌న ఫ్రెండ్స్ కృష్ణ విజ‌య్, ప్ర‌శాంతిల‌తో క‌లిసి నారా రోహిత్ నిర్మించాడు. సాగ‌ర్ చంద్ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.
అసుర సినిమాతో నిర్మాత‌గా మారిన నారా రోహిత్ ఇక నుంచి హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా వ‌రుస‌గా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 2017లో మూడు సినిమాల‌ను నిర్మించాలి అనుకుంటున్నాడ‌ట‌. త‌ను హీరోగా న‌టించే సినిమాల‌తో పాటు వేరే హీరోల‌తో కూడా సినిమాల‌ను నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. హీరోగా రాణిస్తున్న నారా రోహిత్ నిర్మాత‌గా కూడా స‌క్సెస్ అవుతాడ‌ని ఆశిద్దాం..!

More News

సీక్వెల్ తీస్తానంటున్న స‌ప్త‌గిరి..!

క‌మెడియ‌న్ గా కెరీర్ ప్రారంభించి...స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన యువ న‌టుడు స‌ప్త‌గిరి. ఇటీవ‌ల రిలీజైన స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా స‌ప్త‌గిరి మీడియాతో మాట్లాడుతూ....ద‌ర్శ‌కుడు అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. అనుకోకుండా క‌మెడియ‌న్ అయ్యాను.

అఖిల్ 3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్..!

అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

కాటమరాయుడు మరో పోస్టర్ రిలీజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విదేశాల్లో మ‌హేష్ ఫ్యామిలీతో చ‌ర‌ణ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.