మ‌నం డైరెక్ట‌ర్ తో నాని?

  • IndiaGlitz, [Friday,September 29 2017]

శ్రియ తొలి చిత్రం ఇష్టంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ కె. కుమార్‌.. ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో తెలుగువారికి చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అఖిల్ రీ లాంఛ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. ఆ రోజుకి ఒక రోజు ముందు నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ఎం.సి.ఎ కూడా విడుద‌ల కానుంది.

క్రిస్మ‌స్ బ‌రిలో విక్ర‌మ్ కె.కుమార్‌, నాని సినిమాలు పోటీప‌డుతున్న‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్‌లో వీరిద్ద‌రు ఒకే సినిమా కోసం ప‌నిచేసే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం నాని ఎం.సి.ఎతో పాటు కృష్ణార్జున యుద్ధం కూడా చేస్తున్నాడు. ఈ సినిమాల‌తో పాటు విక్ర‌మ్ హ‌లో కూడా పూర్త‌య్యాకే వీరి కాంబినేష‌న్‌లో సినిమా ప్రారంభం కావ‌చ్చ‌ని చెప్పుకుంటున్నారు. ఒక‌వేళ నాని, విక్ర‌మ్ సినిమా ఓకే అయితే గ‌నుక ఓ ఆస‌క్తిక‌ర‌మైన సినిమా తెలుగు ప్రేక్ష‌కులు చూడ‌బోతున్న‌ట్టే.

More News

అడివి సాయికిరణ్, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ చాముండీ చిత్ర సినిమాలు

'మిస్టర్‌ పెళ్లాం', 'శ్రీకారం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు.

ఆమెని కూడా మెచ్చుకున్న థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున న‌టించిన రాజుగారి గ‌ది2, హిందీ చిత్రం గోల్ మాల్ ఎగైన్‌, సాయిధ‌ర‌మ్ జ‌వాన్‌తో పాటు రేపు విడుద‌ల కానున్న శ‌ర్వానంద్ మ‌హానుభావుడు చిత్రాల‌కు థ‌మ‌న్‌నే సంగీత ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా అప్పుడేనా?

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన జైల‌వ‌కుశ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో  సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న‌ది స్ప‌ష్ట‌మౌతుంది.

'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.

మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న వింగ్స్ మూవీ మేక‌ర్స్ చిత్రం

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై ఇటీవ‌ల కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.