నాని, త్రివిక్ర‌మ్ చిత్రానికి నిర్మాత ఎవ‌రంటే..

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

నేచుర‌ల్ స్టార్ నాని, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుందంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివ‌ర‌లోగానీ.. వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలోగానీ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు.భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ప్ర‌స్తుతం నాని.. నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. ఇక త్రివిక్ర‌మ్ తాజా చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ ద‌స‌రా స‌మ‌యంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

More News

బాల‌య్య ఖాతాలో మ‌రో ఫ్యాక్ష‌న్ మూవీ

తెలుగునాట ఫ్యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడిగా ట్రెండ్ సృష్టించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డితో మొద‌లుపెట్టి న‌ర‌సింహనాయుడు, సీమ సింహం, చెన్న‌కేశ‌వ రెడ్డి..

'తేజ్‌' చిత్రం డెఫినెట్‌గా అందర్నీ అలరిస్తుంది - సాయిధరమ్‌ తేజ్‌

'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకున్న సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా 'తేజ్‌'

మ‌హేష్ సినిమాలోనూ అలాగే..

ద‌ర్శ‌కుడిగా త‌న తొలి ప్ర‌య‌త్నం 'మున్నా' నిరాశ‌ప‌రిచినా.. బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నారు వంశీ పైడిప‌ల్లి.

మ‌ళ్ళీ బిజీ అవుతున్న నివేదా

రెండేళ్ళ క్రితం విడుద‌లైన జెంటిల్ మ‌న్ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నివేదా థామ‌స్‌. ఆ త‌రువాత నిన్ను కోరి, జై ల‌వ కుశ చిత్రాలు చేసింది.

రానా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు

ప్ర‌స్తుతం ఇండియన్ స్క్రీన్‌పై బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.