తేజు చేతికి నాని చిత్రం...?

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తుంది. అందులో భాగంగా నేచుర‌ల్ స్టార్ నాని, కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మైంది. అయితే నాని వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టం ఇత్యాది కార‌ణాల వ‌ల్ల సినిమా మెటిరియ‌లైజ్ కాలేక‌పోయింది.

దీంతో చిత్ర నిర్మాత‌లు ఈ సినిమాను తేజు హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌ని యోచిస్తున్నార‌ట‌. అయితే తేజు ఇప్పుడు క‌రుణాక‌ర‌ణ్‌తో సినిమా చేస్తున్నాడు.

దీంతో పాటు గోపీచంద్ మ‌లినేని సినిమా చేయాల్సి ఉంది. చంద్ర‌శేఖ‌ర్ యెలేటి ద‌ర్శ‌క‌త్వంలో తేజు సినిమా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి కిశోర్ తిరుమ‌ల తేజు డేట్స్ అడ్జ‌స్ట్ చేసి సినిమా చేస్తాడంటారా? చూడాలి మ‌రి.

More News

ప్రియా వారియ‌ర్‌కు సుప్రీమ్‌లో ఊర‌ట‌...

'ఒరు అదార్ ల‌వ్‌' అనే మ‌ల‌యాళ సినిమాలో న‌టించిన హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయ్యింది. అయితే ఆమెకు ఎంత ఫేమ్ వ‌చ్చిందో... అదెలా చిక్కులు కూడా వ‌చ్చి ప‌డ్డాయి.

చ‌ర‌ణ్ సినిమా బిజినెస్ క్రేజ్‌...

స్టార్ హీరోల సినిమాల‌కు సినిమా నిర్మాణం నుండే మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా పూర్తి కాక‌ముందు అన్ని ఏరియాల బిజినెస్‌లు పూర్తవుతుంటాయి.

గోపీచంద్ చిత్రంలో మ‌రోసారి...

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం.

ముందుగానే 'కిరాక్ పార్టీ'

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

దేశ‌దిమ్మ‌రి కోసం త‌నీష్ గానం

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి సార‌ధ్యంలో తెర‌కెక్కుతున్న దేశ‌దిమ్మ‌రిలో త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది.