ఎం.సి.ఎ ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

నేచుర‌ల్ స్టార్ నాని, ఫిదా స్టార్ సాయిప‌ల్ల‌వి జంట‌గా ఎం.సి.ఎ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని దీపావ‌ళి కానుక‌గా రేపు (బుధ‌వారం) విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

నేను లోక‌ల్ త‌రువాత నాని, దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. ప్ర‌స్తుతం నాని ఎం.సి.ఎతో పాటు కృష్ణార్జున యుద్ధం కూడా చేస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక‌ గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

More News

న్యూ టాలెంట్‌తో బ‌న్నీ?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌.. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి. త‌న రెండో చిత్రం ఆర్య కోసం సుకుమార్ కి ద‌ర్శ‌కుడిగా తొలి ఛాన్స్ ఇచ్చిన ఆయ‌న‌.. ఆ త‌రువాత మ‌ళ్లీ 13 ఏళ్ల త‌రువాత రైట‌ర్ వ‌క్కంతం వంశీకి ద‌ర్శ‌కుడిగా మొద‌టి అవ‌కాశ‌మిచ్చాడు.

కీర్తి సురేష్ 'మహానటి' కొత్త పోస్టర్ విడుదల

చిత్ర కథానాయకి కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) "మహానాటి" సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకుడు.

మోహ‌న్‌బాబు డ‌బుల్ షేడ్స్‌...

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇప్పుడు ఓకే సినిమాలో రెండు షేడ్స్‌లో న‌టిస్తున్నాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. 'పెళ్ళైన కొత్త‌లో' ఫేమ్‌ మ‌ద‌న్ డైరెక్ట‌ర్‌గా మోహ‌న్‌బాబు న‌టిస్తున్న చిత్రం 'గాయ‌త్రి'.

బోయ‌పాటితో చ‌ర‌ణ్‌...

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాగానే ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది.

వాళ్లిద్ద‌రూ చేయ‌మ‌న్నారు..?

త‌మిళ‌నాట శ‌శిక‌ళ జైలులో అనుభ‌విస్తున్న రాజ‌భోగాల‌ను బ‌య‌ట‌పెట్టిన డీజీపీ రూప సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి విదిత‌మే. ఈమె స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఏఎంఆర్ ర‌మేష్ సినిమాను తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.