ఆ వార్త‌ల‌ను ఖండించిన నాని

  • IndiaGlitz, [Saturday,January 20 2018]

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లైన నాని విజ‌య‌యాత్ర ఎంసీఏ వ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేస్తున్నారు. ఒక పాత్ర కృష్ణ కాగా.. మ‌రో పాత్ర అర్జున‌. ఈ రెండు పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్‌ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. వీటికి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై ఆ మ‌ధ్య ఒక గాసిప్ వ‌చ్చింది. అదేమిటంటే.. చిత్ర ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తొలుత ఈ క‌థ‌ని మ‌రో యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌కి చెప్పాడ‌ని.. ఎందుకో శ‌ర్వాకి ఆ క‌థ క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో.. గాంధీ నానిని అప్రోచ్ అయ్యాడ‌ని గాసిప్స్ వినిపించాయి. ఈ గాసిప్ నాని వ‌ర‌కు చేరుకుంది.

దీనిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని.. త‌న‌ని దృష్టిలో పెట్టుకునే త‌యారుచేసుకున్న క‌థ ఇద‌ని ఇదివ‌ర‌కే ద‌ర్శ‌కుడు చెప్పార‌ని నాని వివ‌ర‌ణ ఇచ్చారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్సార్ మీర్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.