నందు నూతన చిత్రం కన్నుల్లో నీ రూపమే

  • IndiaGlitz, [Thursday,June 09 2016]

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, కన్నడ భామ తేజస్వినీ ప్రకాష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం క‌న్నుల్లో నీ రూప‌మే. నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మిస్తున్నారు. హార్ట్ టచ్చింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాకు కన్నుల్లో నీ రూపమే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూన్ 15 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత భాస్క‌ర్ భాసాని మాట్లాడుతూ....ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఈ సినిమాలో ఓ విభన్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. అలానే ఈ సినిమాతో తేజస్వినీ తెలుగు చిత్ర సీమకి పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కన్నడలో పలు చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న బిక్స్ ఇరుసడ్ల చిత్ర కథను చాలా అద్భుతంగా మలిచాడు, అలానే సంగీత దర్శకుడు సాఖేత్ కంపోజ్ చేస్తోన్న పాటలు కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయయి అని తెలిపారు. జూన్ 15 నుంచి షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు బిక్స్ ఇరుస‌డ్ల‌ తెలియజేశారు.

More News

సెన్సేషనల్ మూవీ 'దండుపాళ్యం-2' షూటింగ్ పూర్తి - ఆగస్ట్ లో రిలీజ్

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

గౌతమీపుత్ర శాతకర్ణి ఫ్రీ లుక్ రిలీజ్..

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈనెల 10న బాలకృష్ణ పుట్టినరోజు.

విజ‌య్ తో న‌టించ‌డం ఓ మ‌ధుర జ్ఞాప‌కం - జ‌గ‌ప‌తి

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ -  జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్లో రూపొందుతున్నఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని భ‌ర‌త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకట్రామ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం హైద‌రాబాద్ షెడ్యూల్ ఈరోజు ప్రారంభ‌మైంది.

50 రోజులు పూర్తిచేసుకున్న స‌మ్మ‌ర్‌ బ్లాక్ బస్టర్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సరైనోడు'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు చిత్రం జూన్‌ 10వ తేదికి విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది.

నా లైఫ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు బాగా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా అదే : సందీప్ కిష‌న్

స్నేహ‌గీతం, ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, బీరువా, టైగ‌ర్, ర‌న్...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి యువ‌త‌లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. తాజాగా సందీప్ కిష‌న్ న‌టించిన చిత్రం ఒక్క అమ్మాయి త‌ప్ప.