టాలీవుడ్‌లో మరో ట్రెండ్ సెట్ చేస్తున్న బాలయ్య... నిర్మాతలకు వరం, ఫ్యాన్స్‌కి పండగ

  • IndiaGlitz, [Friday,October 01 2021]

కరోనా వైరస్, లాక్‌డౌ‌న్‌ పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడా లేని ఆదరణ దక్కింది. ఇప్పుడు థియేటర్లను పక్కనబెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ రాజ్యమేలే పరిస్దితి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పుడు చాలా చోట్ల వివాదాలు నడుస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను శ్రేయాస్ ఏటీటీ ద్వారా గతేడాది దసరా కానుకగా బాలయ్య విడుదల చేశారు. ఇది కేవలం 17 నిమిషాల ఫుటేజ్‌ మాత్రమే. షూటింగ్ అయినంతవరకే ఎడిట్ చేసి రిలీజ్ చేశారు బాలయ్య. ఈ కాస్త నిడివి వున్న సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటిటిలోనే దాదాపు ఒక కోటి 25 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ డబ్బును సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు బాలకృష్ణ.

నర్తనశాల మంచి ఫలితాన్ని ఇవ్వటంతో గతంలో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన రెండు సినిమాలని మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నారు బాలకృష్ణ. అందులో ఒకటి దివంగత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమసింహ భూపతి’ . బాలకృష్ణ , కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. దాదాపు 80 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్ర నిర్మాత చనిపోవడంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా రష్‌ని బయటకి తీసి ఎంతవరకు ఎడిట్ అయితే అంతవరకు చేసి విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు బాలయ్య.

ఇంకోటి బాలకృష్ణ తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తర్వాత హిందీలో కూడా ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో మళ్లీ రీమేక్ చేశారు. తెలుగు వర్షన్ రిలీజ్ అయినా హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఎన్టీఆర్ ఆ సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని వదిలేశారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాని కూడా బాలకృష్ణ ఓటిటి కానీ ఏటిటిలో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.

చిత్ర పరిశ్రమ వరకు ఇది చాలా మంచి పరిణామం. ఇదే కనుక జరిగితే గతంలో ఇలాగే మధ్యలో ఆగిపోయిన చాలా సినిమాలు రిలీజ్ బాట పట్టి ఎంతో కొంత సొమ్ము చేసుకుంటాయి. మరి బాలయ్య ఆ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడ్డారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా సరికొత్త  టాస్క్‌తో దీనికి మరింత ఆజ్యం పోశాడు బిగ్‌బాస్.

2022 జూన్ 3వ తేదీన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదలవుతున్న 'మైదాన్'

ప్రపంచం లో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్). ఈ ఆట నేపధ్యం లో యదార్ధగాద ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా

ఇదే మా కథ’ లాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి - శ్రీకాంత్

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్

తూర్పుగోదావరి జిల్లాలో పవన్, చిరు టూర్.. ఫ్యాన్స్‌కు పండగే..!!

తూర్పుగోదావరి జిల్లాలో మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. తొలుత శుక్రవారం రాజమండ్రికి రానున్నారు చిరంజీవి. శనివారం పవన్ పర్యట వుంటుంది.

బిగ్‌బాస్ 5లో ‘‘ ఆకలి రాజ్యం ’’... కెప్టెన్సీ కోసం కడుపు మాడ్చుకున్న కంటెస్టెంట్స్ , రేసులో ఆ ముగ్గురు

కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను గెలిచేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ  పెట్టారు. దీని వల్ల ఇంటి సభ్యులకు ఫుడ్ విలువ తెలిసొచ్చింది.