close
Choose your channels

ఇంటర్నేషనల్‌ కంపెనీపై నాగ్‌ సెన్సేషనల్‌ ట్వీట్‌

Wednesday, December 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంటర్నేషనల్‌ కంపెనీపై నాగ్‌ సెన్సేషనల్‌ ట్వీట్‌

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, ఇంటర్నేషనల్ స్మార్ట్‌ మొబైల్‌ కంపెనీ యాపిల్‌పై సెన్సేషనల్‌ ట్వీట్‌ చేశాడు. "భారత్‌లో యాపిల్‌ స్టోర్స్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్ కొనేసమయంలో కస్టమర్స్‌ జాగ్రత్త వహించాలి. వాళ్ల సేవలు, పాలసీలు ఏకపక్షంగా ఉన్నాయి. ఇది ఘోరమైన చర్య" అంటూ నాగార్జున యాపిల్‌కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే యాపిల్‌ కంపెనీకి వ్యతిరేకంగా నాగార్జున ఎందుకు ట్వీట్‌ చేశారనేది మాత్రం తెలియడం లేదు. ఇలా ఓ అగ్ర ప్రొడక్టివ్‌ కంపెనీపై ఓ అగ్ర కథానాయకుడు ఇలా కంప్లైంట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో 'వైల్డ్‌డాగ్‌' సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. సాల్మోన్ అహిషోర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది.

అలాగే బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర కూడా చిత్రీకరణ దశలో ఉంది. మరో వైపు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4కు నాగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment