ఇంటర్నేషనల్‌ కంపెనీపై నాగ్‌ సెన్సేషనల్‌ ట్వీట్‌

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, ఇంటర్నేషనల్ స్మార్ట్‌ మొబైల్‌ కంపెనీ యాపిల్‌పై సెన్సేషనల్‌ ట్వీట్‌ చేశాడు. భారత్‌లో యాపిల్‌ స్టోర్స్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్ కొనేసమయంలో కస్టమర్స్‌ జాగ్రత్త వహించాలి. వాళ్ల సేవలు, పాలసీలు ఏకపక్షంగా ఉన్నాయి. ఇది ఘోరమైన చర్య అంటూ నాగార్జున యాపిల్‌కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే యాపిల్‌ కంపెనీకి వ్యతిరేకంగా నాగార్జున ఎందుకు ట్వీట్‌ చేశారనేది మాత్రం తెలియడం లేదు. ఇలా ఓ అగ్ర ప్రొడక్టివ్‌ కంపెనీపై ఓ అగ్ర కథానాయకుడు ఇలా కంప్లైంట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో 'వైల్డ్‌డాగ్‌' సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. సాల్మోన్ అహిషోర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది.

అలాగే బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర కూడా చిత్రీకరణ దశలో ఉంది. మరో వైపు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4కు నాగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

More News

డైరెక్టర్‌ శంకర్‌ను ఆకట్టుకున్న మూడు సినిమాలు

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర శంకర్‌.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కమల్‌హాసన్‌తో భారతీయుడు 2ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది.

చాలా గ్యాప్ తరవాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది!! - దర్శకుడు సుబ్బారావు గోసంగి

"అక్కడొకడున్నాడు, రాఘవరెడ్డి" చిత్రాలనంతరం ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైట్ హౌస్ సినీ మ్యాజిక్' ప్రొడక్షన్ నంబర్-3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బంగారు పుష్పాల గుట్టు రట్టుకు సిద్ధమైన దేవాదాయశాఖ..

శ్రీవారి బంగారు పుష్పాల గుట్టు రట్టు చేసేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది.

ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర(28) బుదవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నై న‌జ‌ర‌త్ పేట్టైలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌‌లో