మలయాళ దర్శకుడితో నాగార్జున...

  • IndiaGlitz, [Monday,January 16 2017]

విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ప్రాముఖ్య‌త‌నిచ్చే హీరో అక్కినేని నాగార్జున త‌ర్వ‌లోనే నాలుగు భాష‌ల్లో రూపొంద‌నున్న ఓ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. శ్రీకుమార్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న రాన్‌డ‌మ్ ఓజ్జ‌మ్ అనే చిత్రంలో నాగార్జున న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. అమితాబ్ బ‌చ్చ‌న్‌, మోహ‌న్ లాల్‌, చియాన్ విక్ర‌మ్‌లు ఆయా భాషల్లో ఈ పాత్ర‌లోన‌టిస్తార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం నాగార్జున ఓం న‌మోవేంక‌టేశాయ ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. అలాగే ఓంకాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రాజుగారి గ‌ది 2 సినిమాలో క్ఊడా నాగార్జున కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.