‘వైల్డ్ డాగ్‌’ను షురూ చేసిన నాగార్జున‌

  • IndiaGlitz, [Monday,August 31 2020]

నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్ షురూ అయ్యింది. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోన్న సమయంలో కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌ను ఆపారు. దాదాపు ఐదారు నెల‌ల త‌ర్వాత వైల్డ్ డాగ్ షూటింగ్‌ను హైద‌రాబాద్‌లో స్టార్ట్ చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌ నాగార్జున పాత్ర‌ను, అత‌నితో టీమ్‌గా ప‌నిచేసే వారి వివ‌రాల‌ను తెలియ‌జేసేలా ఉంది. ఇందులో ఎన్ఐఏ ప‌నిచేసే ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ విన‌య్ వ‌ర్మ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తారు.

మ‌రో వైపు క‌రోనా టైమ్‌లోనూ నాగార్జున బిగ్‌బాస్ సీజ‌న్ 4 కోసం నాగార్జున స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. సెప్టెంబ‌ర్ 4 నుండి బిగ్‌బాస్ ప్ర‌సారం కానుంది. ‘వైల్డ్ డాగ్‌’ పూర్తి కాగానే రాజ‌శేఖ‌ర్‌తో ‘పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ’ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వంలో, మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు.

More News

‘వి’ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - ఇంద్ర‌గంటి

2004లో ద‌ర్శ‌కుడిగా ‘గ్ర‌హ‌ణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారభించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

1 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్

ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో..

ఈ సినిమా థియేటర్‌లో చూస్తే చాలా బాగుంటుందన్నారు: ‘వి’ డైరెక్టర్

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’.

139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ సంచలనం సృష్టించిన యువతి నేడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం.. దుర్గగుడి ఫ్లై ఓవర్..

ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం.. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్‌..