కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో భారీ చిత్రం

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత‌ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ప్ర‌స్తుతం నాగార్జున అక్కినేని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వైల్డ్ డాగ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా కనిపించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. దీని త‌ర్వాతే ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో మూవీ స్టార్ట్ అవుతుంది. మ‌రో వైపు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4లోనూ నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ఆగ‌స్ట్ మొద‌టి వారంలో తెలుగు రియాలిటీ షో హోస్టింగ్‌పై ఓ క్లారిటీ రానుంది.

More News

పొలిటికల్ టర్న్ తీసుకున్న సోనూసూద్ ట్రాక్టర్ వ్యవహారం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ‘సోనూసూద్’. విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కరోనా మహమ్మారి

ఫ్యాన్స్ సంద‌డితో మ‌హేశ్ స‌రికొత్త రికార్డ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన న‌టుడ‌ని కూడా చెప్పొచ్చు.

క‌రోనా దెబ్బ... రూ.2 కోట్లు న‌ష్టం

హీరోగా, నిర్మాత‌గా సినిమాలు చేస్తున్నారు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌.

‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ నుండి వచ్చే ఇచ్చే స‌ర్‌ప్రైజ్ అదేనా?

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. దీనికి ముందుభాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’

హీరోగా మారిన విలన్‌పై చంద్రబాబు ప్రశంసలు

కరోనా మహమ్మారి వచ్చి హీరోలను జీరోలను చేస్తే.. ఓ విలన్‌ని మాత్రం రియల్ లైఫ్ హీరోని చేసింది.