పడేసావే..అనే చిన్న సినిమా పెద్ద విజయం సాధించాలి - కింగ్ నాగార్జున

  • IndiaGlitz, [Thursday,February 25 2016]
కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ప‌డేసావే. ఈ చిత్రం ద్వారా చునియా ద‌ర్శ‌కురాలుగా ప‌రిచ‌యం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన‌ ప‌డేసావే చిత్రాన్ని ఈనెల 26న రిలీజ్ చేయ‌నున్నారు. అనూప్ సంగీతం అందించిన ప‌డేసావే ఆడియో సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ప్లాటినం డిస్క్ వేడుక‌ను అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో నిర్వ‌హించారు. ఈ ప్లాటినం డిస్క్ వేడుక‌కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌రై చిత్ర యూనిట్ కు షీల్డ్స్ అంద‌చేసారు.
ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ....డైరెక్ట‌ర్ చునియా నాకు బాగా తెలుసు కాబ‌ట్టి ఈ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డం లేదు. ప‌డేసావే సినిమా న‌చ్చింది కాబ‌ట్టి ప్ర‌మోట్ చేస్తున్నాను. అలాగే నేను ప్ర‌మోట్ చేయ‌డం వ‌ల‌న ఈ సినిమాకి హెల్ప్ అవుతుండ‌డం నాకు హ్యాపీగా ఉంది. నేను ప‌డేసావే సినిమా చూసాను. చూస్తున్నంత సేపు ఏదో సినిమా చూస్తున్నాం అని కాకుండా క్యారెక్ట‌ర్స్ లోకి ఇన్ వాల్వ్ అయ్యేలా చునియా చాలా చక్క‌గా తెర‌కెక్కించింది. ప‌డేసావే టీమ్ ని చూస్తుంటే ఎంత ప్రేమ‌తో ఈ సినిమా చేసారో తెలుస్తుంది. ప‌డేసావే అనే చిన్న సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మాట్లాడుతూ...చునియా క‌థ చెబుతున్న‌ప్పుడే టైటిల్ కి త‌గ్గ‌ట్టు న‌న్ను ప‌డేసింది. ఈ సినిమా క‌థ బాగుంది దానికి త‌గ్గ‌ట్టు మాట‌లు ఇంకా బాగున్నాయి. అంద‌రికీ న‌చ్చే సినిమా ప‌డేసావే అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ మాట్లాడుతూ...టాలెంట్ ఎక్క‌డ ఉన్నా నాగార్జున గారు ప్రొత్స‌హిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని నాగార్జున గారు ప్ర‌మోట్ చేయ‌డం సంతోషంగా ఉంది. ఆద్యంత స‌ర‌దాగా సాగే సినిమా ఇది. డైరెక్ట‌ర్ చునియా ఈ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ప‌డేసావే విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ చునియా మాట్లాడుతూ....సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి 15 ఏళ్లు అయ్యింది. ఇప్ప‌టికి డైరెక్ట‌ర్ కావాల‌నే నా డ్రీమ్ నెర‌వేర‌డం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో కార్తీక్, హీరోయిన్ నిత్యాశెట్టి, కృష్ణుడు, రైట‌ర్ కిర‌ణ్, గీత ర‌చ‌యిత అనంత శ్రీరామ్, అనితా చౌద‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

చిరు పై సెటైర్ వేసిన‌ బాల‌య్య‌..

నంద‌మూరి బాల‌కృష్ణ లేపాక్షి ఉత్స‌వాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడు లో మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌ను లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని పిల‌వ‌లేదా అని జ‌ర్న‌లిస్ట్ లు అడ‌గితే.

నారా రోహిత్ 'సావిత్రి' సాంగ్ రిలీజ్

నారా రోహిత్...,యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.

ఆ ఇద్ద‌రి భామ‌ల‌ను ఫైన‌ల్ చేసిన మెగా హీరో

మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నారు. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న సుప్రీమ్ ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

దేవాలయాలు ప్రారంభించిన అగ్ర హీరోలు..

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే.ఈ ప్రాముఖ్యతను మరింత పెంచేలా ఈ దైవ సన్నిధానంలో మరిన్ని దేవాలయాలను ఏర్పాటు చేసారు.

ఆ వార్తల్లో వాస్త‌వం లేదంటున్న చిరు

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి బి.జె.పి లో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లోఅయితే   చిరు బి.జె.పి కి ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌ని...ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సి.ఎం అభ్య‌ర్ధిగా చిరంజీవిని  బి.జె.పి ప్ర‌క‌టించ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.