విరామమే లేకుండా నాగ్ , నాని చిత్రం

  • IndiaGlitz, [Wednesday,March 14 2018]

నాగార్జున, నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. పూర్తిగా హాస్యప్రధానంగా సాగే ఈ చిత్రంలో నాగార్జున, నాని పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే.. నాని పుట్టినరోజున పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. ఉగాది పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.

ప్రస్తుతం నాగార్జున ఆఫీసర్' మూవీతో, నాని కృష్ణార్జున యుద్ధం' చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత తొందరగా వీటిని పూర్తిచేసుకుని.. విరామమే లేకుండా ఈ మల్టీస్టారర్ మూవీ చిత్రీకరణలో పాల్గోవాలని ఈ ఇద్దరు హీరోలు నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. అంతేగాకుండా.. ఆగష్టు కల్లా చిత్రీకరణను పూర్తిచేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నాగ్ సరసన అమలా పాల్, నానికు జంటగా శ్రద్ధా శ్రీనాథ్ నటించనున్నారని సమాచారం.

More News

మూగవాడిగా నారా రోహిత్

విభిన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో నారా రోహిత్

బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మొ

బెల్లంకొండ శ్రీనివాస్‌తో బాలీవుడ్ యాక్ట‌ర్‌....

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా  శ్రీనివాస్ దర్శకత్వంలో రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నవీన్ శొంటీనేని (నాని) నిర్మిస్తున్నారు.

అమితాబ్‌కు ఏం జ‌రిగింది?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌కు ఏం జ‌రిగింది?... అనే ప్ర‌శ్న ఆయ‌న అభిమానుల‌ను వేధిస్తుంది. ఎందుకంటే.. ఆయ‌న బ్లాగ్‌లో ఆయ‌న ఇచ్చిన స‌మాచారం అలా ఉంది. నేను డాక్ట‌ర్ల‌ను క‌ల‌వ‌బోతున్నాను. వారు న‌న్ను మామూలుగా చేస్తారు.

బాల‌య్య‌తో బాలీవుడ్ బ్యూటీ...

బాల‌కృష్ణ రూపొందుతోన్న 103వ చిత్రం 'య‌న్టీఆర్‌'. త‌న తండ్రి, మాజీ ముఖ్య‌మంత్రి జీవిత‌గాథ‌లో నటుడు నుండి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అయ్యే వ‌ర‌కు ఉన్న ఘ‌టాల‌ను ఆధారంగా చేసుకుని బ‌యోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తేజ తెర‌కెక్కిస్తున్నాడు.