నాగార్జున విలనిజం

  • IndiaGlitz, [Sunday,October 25 2015]

నాగార్జున ఇప్పుడు విలన్ గా నటించడానికి సిద్ధమయ్యారు. ఓ వైపు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న నాగార్జున నిర్మలా కాన్వెంట్, అఖిల్ చిత్రాల్లో కేమియో ఇవ్వనున్నారు. ఇప్పుడు ఆయన మరో బోల్డ్ డిసెషన్ తీసుకున్నారు. రామ్ చరణ్ సినిమాలో విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. జయం రవి హీరోగా నటించిన తని ఒరువన్ కు రీమేక్ లో నటిస్తున్నారు చరణ్. అందులో అరవింద్ స్వామి నటించిన పాత్రలో నటించడానికి ఇప్పుడు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఈ పాత్రలో నటిస్తారని మాధవన్, జగపతిబాబుతో పాటు పలువురి పేర్లు వినిపించాయి. ఫైనల్ గా నాగార్జున లాక్ చేశారట. డిసెంబర్ నుంచి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా మొదలు కానుంది.