నాగ్ దెబ్బకు ఎన్టీఆర్ రికార్డ్ బద్దలైందిగా!!

  • IndiaGlitz, [Friday,August 02 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-1 జూనియర్ ఎన్టీఆర్‌తో, సీజన్-2 నేచురల్ స్టార్ నానితో.. మూడో సీజన్‌ను అక్కినేని నాగార్జునతో ‘మా’ టీవీ యాజమాన్యం, నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారు. రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడోసీజన్ కూడా మొదటి వారం పూర్తి చేసుకోగా.. మరో రెండ్రోజుల్లో రెండోవారం కూడా పూర్తి కానుంది. అయితే షో పరిస్థితేంటి..? జనాలు చూస్తున్నారా..? లేదా..? బిగ్‌బాస్‌ను ఏ మాత్రం ఆదరిస్తున్నారు అనేది దాదాపు మొదటి వారం పూర్తయ్యే సరికే సీన్ అర్థమైపోయింది. అదెలాగంటే మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే అసలు విషయమేంటో తేలిపోయింది.

ఎవరి సత్తా ఏంటి!?

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్‌కి 16. 18 శాతం రేటింగ్ వచ్చింది. మరోవైపు రెండో సీజన్‌లో నానికి 15.05 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక నాగార్జున హోస్ట్ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు మాత్రం ఏకంగా 17. 9 రేటింగ్ రావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు హయ్యస్ట్‌గా ఎన్టీఆర్ రికార్డును నాగ్ బద్దలు కొట్టేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

అనుమానాలన్నీ పటాపంచలయ్యాయ్!

అంతేకాదు.. ప్రస్తుతం ఈ షోతో 1108 జీఆర్పీఎస్‌తో ‘స్టార్ మా’ ఛానెల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్‌లో ఎలాగైతే ఎన్టీఆర్ రాకతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుందో.. అదే విధంగా తాజా ఎపిసోడ్‌తో నంబర్ వన్ స్థానం ఆక్రమించింది ‘మా’టీవీ. ప్రస్తుతం సీజన్-3ను 4 కోట్ల 50 లక్షల మంది వీక్షిస్తుండటం ఆషమాషీ విషయమేం కాదు. కాగా తాజా టీఆర్పీలతో బిగ్ బాస్ సీజన్-3కి ఆదరణ తగ్గిందనే అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

మున్ముందు మరెన్నో..!

మొదటి రెండు సీజన్లలో దాదాపు ఎలాంటి వివాదాలు లేకుండానే షో సాగిపోయింది. అయితే ఈ మూడో సీజన్లో మాత్రం ఎన్నో వివాదాలు.. మరెన్నో నిరసనలు, హెచ్చరికలు మధ్య షో ప్రారంభమైనప్పటికీ.. అవన్నీ ఈ సీజన్‌కు ప్లస్ అయ్యాయ్ తప్ప ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు. ఓవైపు వివాదాలు నడుస్తున్నప్పటికీ బుల్లితెర వీక్షకులు ఈ రియాలిటీ షోను మాత్రం బాగానే అభిమానుల ఆదరణ చూరగొన్నది. మరోవైపు ఇదీ కింగ్ దెబ్బ అంటే అంటూ.. నాగార్జున అక్కినేని అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే సంచలన రికార్డ్‌ను నమోదు చేసిన నాగ్.. మున్ముందు మరెన్ని రికార్డ్‌లు బద్దలు కొడతారో వేచి చూడాల్సిందే మరి.

More News

ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్సివ్ థ్రిల్ల‌ర్ 'రాక్ష‌సుడు': బెల్లంకొండ శ్రీనివాస్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా 'రైడ్‌', 'వీర' చిత్రాల దర్శకుడు రమేష్‌వర్మ పెన్మత్స

విడిపోతున్నామ‌ని ప్ర‌క‌టించిన హీరోయిన్‌

బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా త‌న వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ హైద‌రాబాదీ హీరోయిన్ భ‌ర్త సాహిల్ సింఘా నుండి విడాకులు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ్యాపార‌వేత్త సాహిల్ సింఘాతో చాలా

ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా 'కౌసల్య కృష్ణమూర్తి'

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

ట్విట్టర్‌లో మహిళ వర్సెస్ యాంగ్రీస్టార్.. ఫైనల్‌గా రాజశేఖర్ క్లారిటీ

సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులు, నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు.

నా తొలి చిత్రంలోనే ఇలాంటి అవకాశం రావడం ఎంతో థ్రిల్లింగ్‌ గా ఉంది-'22 'హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి

సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే...