నాగార్జున మ‌రో భ‌క్తిర‌స చిత్రం..!

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాల త‌ర్వాత న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున న‌టించిన మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు. మ‌హేష్ రెడ్డి నిర్మించిన ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే....ఓం న‌మో వేంక‌టేశాయ ఆడియో వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ...ర‌చ‌యిత జె.కె.భార‌వి మ‌రో క‌థ రెడీ చేస్తున్నారు. కాక‌పోతే అది భ‌క్తిర‌స చిత్రం కాదు అని చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...ఇస్కాన్ (అంత‌ర్జాతీయ కృష్ణ చైత‌న్య సంఘం) ఫౌండ‌ర్ అయిన స్వామి ప్ర‌భుపాద జీవితం ఆధారంగా భార‌వి క‌థ రెడీ చేస్తున్నార‌ట‌. శ్రీకృష్ణుడి భ‌క్తుడి జీవిత క‌థ కాబ‌ట్టి ఈ చిత్రాన్ని ఇస్కాన్ పౌండేష‌న్ నిర్మించ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంద‌ట‌.మ‌రి... నాగ్ ఈ మూవీ చేస్తే మ‌రో సంచ‌ల‌న‌మే..!