Nagarjuna: మహేశ్‌తో మల్టీస్టారర్ మూవీపై నాగార్జున ఏమన్నారంటే..?

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

ఈసారి సంక్రాంతి రేసులో కింగ్ నాగార్జున కూడా నిలిచిన సంగతి తెలిసిందే. 'నా సామిరంగ' మూవీతో భోగి రోజు ప్రేక్షకులను పలకరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ బిజీగా ఉంది. తాజాగా నాగార్జున తన సినిమాల గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

సినిమా కథ ఇదే..

ఈ సినిమా కథ భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో జరుగుతుందని.. అందుకే సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మలయాళ మూవీకి రిమేక్ అయినా సోల్ మిస్ అవ్వకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మూవీని తెరకెక్కించామన్నారు. ఇక మూవీ షూటింగ్‌కు 72 రోజుల సమయం పట్టిందని.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు 5 నెలలు చేశామని.. తన పార్ట్‌ 60 రోజుల్లో పూర్తి చేశారన్నారు. గతంలో 30 రోజుల్లోనే తన సినిమాలు కొన్ని తీశామన్నారు. అయితే సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువవుతాయని చెప్పారు. ఈ మూవీలో అలాంటి తప్పులు జరగకుండా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ రోజులు చేశామన్నారు.

ఈ టైటిల్ అందుకే పెట్టాం..

ఈ సినిమాలో చాలా టిపికల్ లవ్ స్టొరీ ఉందన్నారు. హీరోయిన్‌కు, తనకు మధ్య 12 ఏళ్ల నుంచి ఓ ప్రేమకథ నడుస్తుందని.. మళ్లీ 30 ఏళ్లు వచ్చే సరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటామని పేర్కొన్నారు. హీరోయిన్ అషికా రంగనాథ్ చాలా బాగా నటించిందని ప్రశంసించారు. 'నా సామిరంగ' టైటిల్‌ ఈ కథకు కచ్చితంగా సరిపోతుందని.. ఈ సినిమాలో తన ఊతపదం ఇదన్నారు. ఇక మూవీ రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు ఉంటుందన్నారు. మొత్తం 2 గంటల 35 నిమిషాలు షూట్‌ చేశామని.. కానీ 15 నిమిషాలు సీన్స్ కట్ చేశామని నాగ్ తెలిపారు.

ఆ పాత్రకు అల్లరి నరేశ్‌ కరెక్ట్‌..

ఇక మూవీలో అల్లరి నరేశ్‌ని అందరం కలిసి ఎంపిక చేశామని.. ఆ పాత్రకు నరేశ్ కరెక్ట్‌గా సరిపోతారని చెప్పుకొచ్చారు. తనతో పాటు రాజ్ తరుణ్‌ది కూడా కథలో కీలకమైన పాత్ర అని చెప్పారు. తన సినిమాలు అన్నింటిలో పోలిస్తే ‘నా సామిరంగ’ చాలా మాస్ ఎంటర్‌టైనర్‌ అని వివరించారు. తదుపరి సినిమాల గురించి చెబుతూ ప్రస్తుతం తమిళ దర్శకుడు నవీన్‌తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నానని.. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంతో ఓ మూవీ ఉంటుందని తెలిపారు. ఇక మహేశ్‌బాబుతో మల్టీస్టారర్ చేయాలనుకున్నా.. కానీ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు.. అది పూర్తి కాగానే మల్టీస్టారర్ గురించి ఆలోచిస్తానని సమాధానమిచ్చారు. మొత్తానికి ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' మూవీ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని నాగ్ ధీమా వ్యక్తం చేశారు.

More News

Anganwadi: అంగన్‌వాడీలకు ప్రభుత్వం డెడ్‌లైన్‌.. కొత్త వారిని తీసుకుంటామని హెచ్చరిక..

అంగన్‌వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు

YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇటు పరిపాలనతో పాటు

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు ఢిల్లీ, విదేశాల పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఏఐసీసీ సమావేశంలో పాల్గొడంతో పాటు అగ్రనేతలతో భేటీ కానున్నారు.

Atal Setu: దేశంలోనే అతి పెద్ద వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెన 'అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింగ్(MTHL)ను జాతికి అంకితం చేశారు.

వైసీపీ మూడో జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం

సామాజిక న్యాయమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్.. అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నారు.