కణం వాయిదా పడిందా?

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

ఫిదా చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన మ‌ల‌ర్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి.. గ‌తేడాది డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌లైన ఎంసీఏ చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాల విజ‌యాల‌తో సాయిప‌ల్ల‌వికి టాలీవుడ్‌లో మ‌రింత డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఈ రెండు చిత్రాల త‌రువాత సాయిప‌ల్ల‌వి నుంచి రాబోతున్న సినిమా క‌ణం.

త‌మిళంలో క‌రు పేరుతో.. తెలుగులో క‌ణం పేరుతో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రానికి విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించింది. యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తొలుత దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 9కి వాయిదా వేశారు. తాజా స‌మాచారం ప్రకారం.. ఇప్పుడు ఈ చిత్రం మ‌రోసారి వాయిదా ప‌డింద‌ని తెలిసింది. ఫిబ్ర‌వ‌రి 23న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలిసింది. నాలుగేళ్ళ చిన్నారికి త‌ల్లిగా సాయిప‌ల్ల‌వి చేసిన న‌ట‌న సినిమాకి హైలైట్ కానుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

కృష్ణకుమారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు - డా.మంచు మోహన్ బాబు

"నేను కృష్ణకుమారిగారితో కలిసి నటించకపోయినా ఆమెతోపాటు మాత్రమే కాక ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది.

వినాయక్ గారి ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్స్ తో ఎనర్జిటిక్ గా ఉండే 'ఇంటిలిజెంట్ ' - సి.కల్యాణ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.

భరతవర్ష క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం

భరతవర్ష క్రియేషన్స్ పతాకంపై నూతన నటీ నటులతో చెన్నకుని శెట్టి(కుమార్)దర్శకత్వంలో

'టచ్ చేసి చూడు' సెన్సార్ పూర్తి ...ఫిబ్రవరి 2న విడుదల

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు'.

సాయిపల్లవి చిత్రాలు ఒకే రోజున..

ఫిదా చిత్రంతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలర్ బ్యూటీ సాయి పల్లవి.