ఒకే హీరోయిన్‌తో నాగ‌శౌర్య రెండు చిత్రాలు

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

ఊహ‌లు గుస‌గుస‌లాడే, క‌ళ్యాణ వైభోగ‌మే, జో అచ్యుతానంద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వాటిలో కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ రూపొందిస్తున్న ఛ‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇందులో ర‌ష్మిక మండ‌న్న‌ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇదివ‌ర‌కు క‌న్న‌డంలో హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.

కాగా, నాగ‌శౌర్య న‌టించ‌నున్న మ‌రో చిత్రంలోనూ ర‌ష్మిక హీరోయిన్‌గా ఎంపిక‌యింద‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు సాయి శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఛ‌లో సినిమాలో వీరిద్ద‌రి కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డం వ‌ల్లే ఈ జోడీని మ‌రోసారి ఎంచుకున్న‌ట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలోనూ ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మొత్తానికి తెలుగులో ఒక్క సినిమా విడుద‌ల కాకుండానే.. ఈ ముద్దుగుమ్మ క్రేజీ హీరోయిన్‌గా మారింద‌న్న‌మాట‌.

More News

'భ‌ర‌త్ అను నేను' లోనూ అలాగే..

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ కోసం హీరోయిన్ పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'దేవిశ్రీ ప్ర‌సాద్' ప్రీమియ‌ర్ షో

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

'జంధ్యాల రాసిన ప్రేమకథ' సెన్సార్ పూర్తి, 24న విడుదల

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జంధ్యాల రాసిన ప్రేమకథ'. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం.

న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం 'ప్రేమ‌తో మీ కార్తీక్'. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు.