చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న '@నర్తన శాల'

  • IndiaGlitz, [Thursday,June 28 2018]

'ఛలో' ఘ‌న‌విజయం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన ఈ చిత్రం భారీ లాభాల‌నే మూట‌గ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి.. సొంత నిర్మాణ సంస్థ‌లోనే సినిమా చేస్తున్నారాయ‌న‌. ‘@నర్తన శాల’ అనే పేరుతో శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా.. టాకీ పార్ట్‌ను దాదాపు పూర్తిచేసుకుంద‌ని స‌మాచారం. టాకీ పార్ట్ పూర్త‌య్యాక పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం విదేశాల‌కు వెళ్ళ‌నుంది చిత్ర యూనిట్‌. అక్క‌డ జ‌రిగే షెడ్యూల్‌తో సినిమా పూర్త‌వుతుంది. ఆగ‌స్టులో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఛ‌లోతో సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకి కూడా స్వ‌రాలందిస్తున్నారు.