చైతు, మారుతి సినిమా స‌గం పూర్త‌య్యింది

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

యూత్‌ఫుల్ మూవీస్‌తో విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్', 'కొత్తజంట', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలతో విజయాలను అందుకుని.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారాయ‌న‌. ప్రస్తుతం ఈ దర్శకుడు నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజారెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు) సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే.. సగం సినిమాని పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రథమార్ధానికి సంబంధించి కేవలం 20 రోజుల్లో షూటింగ్‌ను పూర్తిచేసారని తెలిసింది. ద్వితీయార్ధానికి సంబంధించి 30 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

అయితే.. చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'సవ్యసాచి' సినిమా కోసం చైతు అదనపు కాల్‌షీట్స్ ఇవ్వడంతో.. మారుతి సినిమా చిత్రీకరణకు కొంత జాప్యం ఏర్పడుతోందని సమాచారం. ఈ క్ర‌మంలో 'సవ్యసాచి' సినిమా పూర్తయిన త‌ర్వాత చైతు.. మారుతి సినిమాపై దృష్టి సారించ‌నున్నట్లు వినికిడి. ఈ నేప‌థ్యంలో.. మారుతి సినిమా సెప్టెంబర్‌లో గాని, అక్టోబర్‌లో గాని విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

More News

లెజెండ్ సినిమా సమర్పణలో విజయ్ ఆంటోనీ 'కాశి' 

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'కాశి'.

నిర్మాణానంతర‌ ప‌నుల్లో 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

పోస్ట్ ప్రొడక్షన్ దశలో సాగరతీరంలో

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు

రానాతో మాత్ర‌మే వెంట‌వెంట‌నే..

దర్శకుడిగా త‌న‌ తొలి సినిమా అయిన‌ ‘చిత్రం’తోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్నారు తేజ.

'టాక్సీవాలా' రాక అప్పుడేనా?

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జంటగా నటించిన మూవీ ‘టాక్సీవాలా’.