ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ నాగ్ అశ్విన్ ..కార‌ణ‌మేంటో తెలుసా?

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ సాహో త‌ర్వాత వ‌రుసగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇందులో ముందుగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రాధేశ్యామ్ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. జూలై 30న విడుద‌ల కానుంది. దీంతో పాటు మ‌రో మూడు ప్యాన్ ఇండియా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో రెండు సినిమాలు స‌లార్‌, ఆదిపురుష్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మ‌రో సినిమా వ‌చ్చేఏడాది అంటే 2022లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఈ నెల 26న ఇస్తాన‌ని డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఎప్పుడో తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే రీసెంట్‌గా ప్ర‌భాస్‌తో చేయ‌బోయే సినిమాపై అప్‌డేట్ ఇవ్వ‌లేనంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ విష‌యంలో త‌ను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది.

More News

బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ..ప్లానింగ్ అదిరిందిగా..!

ఉప్పెన‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, తొలి సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సొంతం చేసుకున్నాడు. దీంతో నిర్మాత‌లంద‌రూ బుచ్చిబాబుతో సినిమా చేయాల‌ని ఉవ్విలూరుతున్నారు.

'క‌ప‌ట‌ధారి' సినిమా చాలా పెద్ద హిట్ కావాలి: కింగ్ నాగార్జున‌

`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`. డిఫ‌రెంట్ క‌థా చిత్రాలు, విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను

'విశాల్ చ‌క్ర' త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది - విశాల్‌

యాక్షన్ హీరో విశాల్, డైరెక్టర్ ఎంఎస్‌ ఆనందన్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘విశాల్ చ‌క్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో రెజీనా క‌సాండ్ర న‌టించారు.

ఒక్క మిస్డ్ కాల్‌లో ఎస్‌బీఐ పర్సనల్ లోన్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కావాలంటే మామూలు విషయం కాదు.. చాలా పెద్ద ప్రాసెస్. అలాంటిది లోను కావాలంటే.. బాబోయ్ అక్కర్లేదు..

అఖిల్ పేరు వినగానే వెంటనే సంతకం చేసేశా: మోనాల్

ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్ ద్వారా బాగా హైలైట్ అయిన జంట ఏదైనా ఉందంటే అది అఖిల్-మోనాల్‌ల జంట. ఈ జంట కోసమే బిగ్‌బాస్ చూసిన వాళ్లూ లేకపోలేదు‌.