ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ చిత్రం?

  • IndiaGlitz, [Wednesday,June 13 2018]

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన నాగ్ అశ్విన్‌.. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని అందుకున్నారు. ఇక ద్వితీయ ప్ర‌య‌త్నంగా న‌టీమ‌ణి సావిత్రి జీవితాన్ని 'మ‌హాన‌టి' పేరుతో తెర‌కెక్కించిన నాగ్‌కు.. ఈ బ‌యోపిక్‌తో ఘ‌న‌విజ‌యం ద‌క్కింది. అంతేగాకుండా.. త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ట్టుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ పొందిన నాగ్‌.. అంత‌కంటే ముందే మ‌రో అగ్ర క‌థానాయ‌కుడిని డైరెక్ట్ చేసే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. ప్ర‌భాస్‌. ఇటీవ‌ల ప్ర‌భాస్‌ను సంప్ర‌దించిన నాగ్‌.. ఓ స్టోరీ లైన్ చెప్పార‌ట‌.

అది న‌చ్చ‌డంతో ప్ర‌భాస్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయ‌డానికి ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై నాగ్ అశ్విన్ మామ‌య్య సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువడుతాయి.

More News

సందడంతా అక్కినేని ఫ్యామిలీదే..

మెగా ఫ్యామిలీ త‌రువాత ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీగా అక్కినేని ఫ్యామిలీని చెప్పుకోవ‌చ్చు.

ఒకే నెల‌లో రెండు మెగా ఫ్యామిలీ చిత్రాలు

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు క‌థానాయ‌కుల చిత్రాలు.. ఒకే నెల‌లో విడుద‌ల‌వ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రిగే విష‌య‌మే. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ఇంటిలిజెంట్‌

క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను పూర్తి చేసిన స‌మంత‌

'రంగ‌స్థ‌లం', 'మ‌హాన‌టి', 'అభిమ‌న్యుడు' చిత్రాల‌తో ఈ వేస‌విలో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాల‌లో న‌టిస్తున్నారు.

మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?

ఉత్త‌మ న‌టిగా ప‌లు అవార్డుల‌ను అందుకున్న బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ది డ‌ర్టీ పిక్చ‌ర్‌తో ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.