ముంబాయిలో నాగ అన్వేష్ పాటల రికార్డింగ్

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యంగ్ టాలెండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'బెంగాల్ టైగర్' కు భీమ్స్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న 'ఏంజిల్'కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు భీమ్స్.

తాజాగా ముంబాయ్ లో ప్రముఖ ఆడియో రికార్డింగ్ థియేటర్ లో 'ఏంజిల్' పాటల రికార్డింగ్ మొదలైంది. సంగీత దర్శకుడు భీమ్స్ ఆధ్వర్యంలో టాప్ సింగర్స్ విజయ్ ప్రకాష్, శ్రేయ గోషాల్ అలానే అల్లు అర్జున్ సరైనోడు లో బ్లాక్ బస్టర్ పాట పాడిన నకాష్ అజీజ్ తదితరలు 'ఏంజిల్' కు పాటలు పాడబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఒకవైపు పాటల రికార్డింగ్ ఊపందుకుంటే మరో వైపున ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. కథ చాలా అద్భుతంగా వచ్చిందని త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.

More News

నాడు మాస్, జై చిరంజీవ - నేడు సర్ధార్, అ ఆ

మాస్,జై చిరంజీవ-సర్ధార్,అ ఆ...ఈ నాలుగు చిత్రాలకు ఉన్న లింకు ఏమిటి అని తెగ ఆలోచిస్తున్నారా..?

స‌మంత అ ఆ చూసిన చైత‌న్య‌..

నితిన్ - స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. ఈరోజు అ ఆ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.

జర్నలిస్ట్ గా సమంత

బెంగళూర్ డేస్, థెరి, బ్రహ్మోత్సవం, 24, అఆ సినిమాలతో ఈ ఏడాది సందడి చేసిన హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన వార్తల్లో యూ టర్న్ అనే మూవీని సమంత నిర్మిస్తూ నటించనుందని వార్తలు వచ్చాయి.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫ‌స్ట్ లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ - చిత్ర‌యూనిట్

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, 21F ఫేం హెబాప‌టేల్‌, త‌మిళం లో అట్ట‌క‌త్తి, ముందాసిప‌త్తి, ఎధిర్ నీచ‌ల్ ఫేం నందిత స్వేత  ల కాంబినేష‌న్ లో టైగ‌ర్ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా మేఘ‌న ఆర్ట్స్ ని

బన్ని నిర్మాతతో పవన్...?

ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాతగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ మరో సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి రెఢీ అవుతున్నాడు.