నందినీ రెడ్డితో విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

అలా మొద‌లైంది చిత్రంతో సూప‌ర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి రీసెంట్‌గా క‌ల్యాణ వైభోగ‌మే చిత్రంతో కూడా మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పెళ్ళిచూపులు చిత్రంలో హీరోగా న‌టించి ఫేమ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర కొండతో కలిసి ఓ చిత్రం చేయ‌నుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో నందినీ రెడ్డియే తెలియ‌జేసింది. ఇప్పుడు స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను స్టార్ట్ చేస్తామ‌ని త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాన‌ని కూడా చెప్పుకొచ్చింది.