బయట తెలియని కొన్ని వాస్తవాలతో ‘నాలో.. నాతో.. వైఎస్సార్’: విజయమ్మ

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ.. ఓ పుస్తకం రాశారు. తన భర్త జీవితం గురించి బయటకు తెలియని ఎన్నో విషయాలను ఆమె ఆ పుస్తకంలో వివరించారు. ఆ పుస్తకానికి ఆమె ‘నాలో.. నాతో.. వైఎస్‌ఆర్’ అనే టైటిల్ ఇచ్చారు. వైఎస్‌తో గడిపిన జీవితం.. ఆయన మరణానంతర పరిస్థితులను ఆ పుస్తకంలో ఆమె చక్కగా పొందుపరిచారు. నేడు వైఎస్‌ఆర్ 71వ జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల కానుంది. ఆమె రాసిన ఆ పుస్తకాన్ని వారి కుమారుడు, ఏపీ సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

మాజీ ముఖ్యమంత్రి భార్య రాసిన పుస్తకాన్ని ఒక ముఖ్యమంత్రిగా వారి కుమారుడే విడుదల చేయడం చాలా అరుదు. ఆ పుస్తకంలో తాను బయటి ప్రపంచానికి తెలియని ఒక గొప్ప నాయకుడి గురించి కొన్ని వాస్తవాలను రాశానని విజయమ్మ పేర్కొన్నారు. చిన్న వయసులోనే వివాహం నుంచి లెజెండరీ లీడర్ జీవితం.. అప్పటి పరిస్థితులు.. పేదవాడి వైద్యుడిగా పేరు సంపాదించడం.. రాజకీయాల్లోకి ప్రవేశించడం.. ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు.. తదితర విషయాలన్నింటి నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకూ విజయమ్మ ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురించింది.

More News

ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

బ‌న్నీతో మ‌రోసారి..!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప‌’ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

షాక్ కొట్టించిన కరెంటు బిల్లు.. సింగిల్ బెడ్రూంకి రూ.25 లక్షలు

తెలంగాణలో కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో కానీ.. బిల్లు చూస్తే మాత్రం కొట్టడం ఖాయం అనిపిస్తోంది.

శ‌ర్వానంద్‌తో రాశీఖ‌న్నా...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు.

108 వాహనాన్ని నడిపి సందడి చేసిన రోజా

నగరి ఎమ్మెల్యే రోజా ఇవ్వాళ 108 వాహనాన్ని పుత్తూరు నగర వీధుల్లో నడిపి సందడి చేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా చూశారు.