ఏప్రిల్ 13న 'నా పేరు సూర్య' 3rd సింగిల్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ మ‌రియు డైలాగ్ ఇంపాక్ట్  చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది... ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్న ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి గారు రాసిన బ్యూటిఫుల్ ల‌వ్ అనే 3వ సింగిల్ ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నారు, త్వ‌ర‌లోనే మిగ‌తా సింగిల్స్ విడుద‌ల చేసి, నెలాఖ‌రున గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా అత్యంత భారీగా,  గ్రాండియర్ గా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా హీరో ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఫ‌స్ట్ ఇంపాక్ట్‌, డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెప్తున్నారు.

ఈ చిత్రానికి మెయిన్ బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ని ఎప్పుడూ చూడ‌ని విధంగా ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం బ‌న్ని త‌న ప్రాణం పెట్టి చేశాడ‌నేది అక్ష‌ర‌స‌త్యం. పాత్ర‌లో ఇమిడిపోవ‌డ‌మే కాకుండా డెడికేష‌న్ తో అస‌లు రియ‌ల్ మిల‌ట‌రి వాళ్ళు ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో తెలుసుకుని, వాళ్ళ‌ని క‌ల‌సి ఇది సినిమా అని కాకుండా పాత్ర‌లో జీవించాడు.

చిత్రం చూసిన వారికి తెలుస్తుంది. మే 4న ప్రేక్ష‌కులు చెప్పె మెద‌టి మాట బ‌న్ని ఫెర్‌ఫార్మెన్స్ గురించే..మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు సాంగ్స్ అటు ఆన్‌లైన్ లో కాని ,కాల‌ర్‌టోన్స్ గా కాని మంచి క్రేజ్ ని సొంతం చేస‌కున్నాయి.

ఇప్ప‌డు ఏప్రిల్ 13న గురువుగారు సీతారామ‌శాస్త్రి గారు ర‌చించిన భ్యూటిఫుల్ ల‌వ్ అని సాగే 3వ సింగిల్ ని విడుదల చేస్తున్నాము. అన్ని  కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.అని అన్నారు. 

More News

'రంగ‌స్థ‌లం' స‌క్సెస్ మీట్ తేది ఖ‌రారు...

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ‌ఛరణ్ పెర్ఫామెన్స్‌.. సుకుమార్ టేకింగ్‌.. స‌మంత న‌ట‌న‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇలా ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారంతో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'.

'భ‌ర‌త్ అనే నేను' ..ఆ సీన్స్ ఎంతో కీలకం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’.

టీమ్‌కి మ‌హేశ్ బ‌హుమతి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోచేసిన సినిమా `భ‌ర‌త్ అనే నేను`.

ర‌జ‌నీ చిత్రంలో మ‌రో బాలీవుడ్ విల‌న్‌?

సూపర్ స్టార్ రజనీ కాంత్, త‌మిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ముగ్గురు హీరోలు?

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.