వైజాగ్‌ ఆర్ కె బీచ్ లో నా పేరు సూర్య సైకత శిల్పం

  • IndiaGlitz, [Saturday,April 07 2018]

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

విశాఖ‌ప‌ట్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియోష‌న్ త‌రుపున అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్బంగా వైజాగ్ ఆర్ కె బీచ్ లో వేసిన  సైకత శిల్పం చూపరుల్ని విశేషం గా ఆకట్టుకునేలావుంది.  5 ఫీట్ ఎత్తు లో... 30 ఫీట్లలో తీర్చిదిద్దారు. ఈ సాండ్ ఆర్ట్ ని రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సైకత శిల్పి మానస్ శేషు ఆధ్వర్యంలో వేశారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు సైకత శిల్పాన్ని చూసి పండగ చేసుకుంటున్నారు. విశాఖ‌ప‌ట్నం ఆర్‌.కె బీచ్ కి వ‌స్తున్న సంద‌ర్శ‌కులు ఇప్పటికే సెల్ఫిలు దిగ‌టం విశేషం. ఇది  అల్లు అర్జున్ కి అభిమానులు ఇస్తున్న అందమైన కానుక అని సైకత శిల్పి అన్నారు.

ఈ పుట్టిన‌రోజు సందర్భంగా అభిమానులు ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని చేయ‌టం చాలా అభినందించాల్సిన విష‌యం అన్నారు.  మరోవైపు  ఈ నెల 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. 

More News

'రంగ‌స్థ‌లం' ను అభినందించిన మహేశ్‌, రాజ‌మౌళి

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుద‌లైంది.

న‌టుడు రావు ర‌మేశ్ త‌ల్లి క‌న్నుమూత

ప్ర‌ముఖ దివంగ‌త న‌టుడు రావు రమేశ్ త‌ల్లి క‌మ‌ల‌కుమారి(77)ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు.

నాగార్జున - వర్మల 'ఆఫీసర్' టీజర్ రిలీజ్ డేట్

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్‌, కాంబినేష‌న్‌లో ల‌వ్‌స్టోరీగా రూపొందుతోంది - నిర్మాత కె.ఎస్‌.రామారావు

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

ప‌బ్లిక్ మ‌ధ్య‌లో కూర్చోని సినిమా చూడ‌టం చాలా హ్యాపీగా ఉంది - 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో' చిత్ర యూనిట్‌!!

హ‌రి హ‌ర చ‌ల‌న చిత్ర ప‌తాకంపై  నందు, సౌమ్య  వేణుగోపాల్, పూజారామ‌చంద్ర‌న్ , గ‌గ‌న్ విహారీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో'.