హ్యాట్రిక్ కొట్టిన నిర్మాణ సంస్థ‌

  • IndiaGlitz, [Saturday,March 31 2018]

ఓ కొత్త‌ నిర్మాణ సంస్థ నిర్మించిన మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాలు వ‌రుస విజ‌యాలు సాధించ‌డ‌మ‌నేది అతి త‌క్కువ సంద‌ర్భాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న సంస్థ మైత్రీమూవీ మేక‌ర్స్‌. 2015లో విడుద‌లైన శ్రీ‌మంతుడుతో నిర్మాణ రంగంలోకి దిగిన ఈ సంస్థ‌.. తొలి సినిమాతో ఘ‌న‌విజ‌యాన్ని అందుకుంది. మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఆ త‌రువాత ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఇదే సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ 2016లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే సంస్థ నిర్మించిన మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అదే.. రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ వ‌చ్చింది.  క‌లెక్ష‌న్స్ కూడా బాగున్నాయి. చూస్తుంటే.. ఈ నిర్మాణ సంస్థ హ్యాట్రిక్ కొట్టేలా ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.  

More News

వ‌రుస‌గా అలాంటి పాత్ర‌ల‌తోనే రామ్ చ‌ర‌ణ్‌

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేసిన చిత్రం రంగ‌స్థ‌లం. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా.. రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన చిత్రంగా నిలిచిపోయింది.

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి అలాగే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో మ‌గ‌ధీరది ప్ర‌త్యేక స్థానం. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ ద‌శ‌, దిశ మారింద‌నే చెప్పాలి.

సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో సునీల్‌?

కెరీర్ ప్రారంభంలో క‌మెడీయ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌..

శృతి హాస‌న్ కొత్త చిత్రానికి ఓకే చెప్పిందా?

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు

‘పెళ్లిచూపులు’, అర్జున్ రెడ్డి’ చిత్రాల విజ‌యాల‌తో యూత్ స్టార్ విజయ్ దేవరకొండ