నా ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి: వరలక్ష్మి శరత్‌కుమార్

  • IndiaGlitz, [Thursday,December 03 2020]

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలిపింది. తన అకౌంట్లన్నీ రికవర్ అయ్యేందుకు కొంత సమయం పడుతుందని.. అప్పటి వరకూ తన పేరుతో ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా నమ్మవద్దని వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫాలోయర్స్‌కి తెలిపింది. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.

‘‘గత రాత్రి నా సోషల్ మీడియా అకౌంట్లు.. ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ హ్యాక్ అయ్యాయి. నేను వాటిని ఇప్పటి వరకూ యాక్సెస్ చేయలేకపోయాను. తిరిగి నా అకౌంట్లను వీలైనంత త్వరగా యాక్సెస్ చేసేంత వరకూ నేను సంబంధిత టీమ్స్‌తో టచ్‌లోనే ఉంటాను. అయితే దీనికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. కాబట్టి కొద్ది రోజుల వరకూ నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం నుంచి వచ్చే మెసేజ్‌ల పట్ల నా ఫాలోయర్లు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. నా అకౌంట్స్ తిరిగి యాక్సెస్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మీరంతా నాకు అందిస్తున్న సపోర్ట్‌కి ధన్యవాదాలు. మళ్లీ మిమ్మల్ని త్వరలోనే ఆన్‌లైన్‌లో కలుస్తా’’ అని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది.

More News

దుల్కర్‌తో సినిమా.. భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిన పూజా హెగ్డే..

అనతి కాలంలో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే.

చివరి గంటే కీలకం..

జీహెచ్ఎంసీ పోలింగ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. దాదాపు ఏ ఎన్నికల్లో అయినా 12 గంటల లోపు ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది.

టైటిల్ విషయంలో క్రిష్ క్లారిటీకి వచ్చేశాడా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది.

ర‌వితేజ‌కు విల‌న్‌గా మారిన హీరో

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ర‌వితేజ‌..

కోవిడ్ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ షూటింగ్ క్యాన్సిల్‌

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.