గోల్కొండ కోటతో నాకు ఉన్న అనుబంధం అమోఘం: చిరంజీవి

  • IndiaGlitz, [Thursday,January 25 2024]

ప్రపంచ దేశాలు భారతదేశ చలనచిత్రం వైపు చూస్తోందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విజయేంద్రప్రసాద్,రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించగా.. కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ-రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు భగవంతుడు కల్పించిన అదృష్టమని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో గోల్కొండలో హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేసిన సందర్భాలు, అలాగే పోరాట సన్నివేశాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. రామ్ చరణ్‌తో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు. వెయ్యి పదాలు చెప్పలేనిది ఓ దృశ్యం చెబుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియజేసేలా అత్యాధునిక టెక్నాలజీతో సౌండ్‌ అండ్‌ లైట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

మన వారసత్వ సంపదను కాపాడుకోవాలని.. గతంలో తాను కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీని టూరిజంలో నెంబర్ వన్‌గా నిలబెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మన దేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు, టూరిజం వసతులు ఎక్కడ ఉండవని తెలిపారు. ఓవైపు ఎడారి, మరోవైపు మంచు, ఇంకోవైపు అత్యధిక వర్షపాతం వంటి విభిన్న స్థితులు ఉన్నాయని.. ఇదీ మన భారత్ గొప్పదనమని కొనియాడారు. అయితే ప్రపంచ టూరిజంలో మనది కేవలం 1.3 శాతమే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెరగాలని, వరల్డ్ టూరిజంలో భారత్ మెరుగైన స్థానంలో ఉండాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. మన జీడీపీలో సింహభాగం టూరిజం నుంచే ఉందని చిరు వెల్లడించారు.

ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో వారసత్వ సంపదకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక గోల్కొండ కోటలో సరికొత్త టెక్నాలజీతో సౌండ్‌ అండ్‌ లైట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ వేయి స్థంబాల గుడిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. అక్కక కూడా ఇలాంటి సౌండ్ అండ్ లైట్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, జోగులాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారక్క అని పేరు పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు.

కాగా పాత లైటింగ్ స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల్ని ఆకర్షించేలా హై ఎండ్‌ టెక్నాలజీతో మ్యూజికల్‌ లైటింగ్‌ షోను అప్‌గ్రేడ్‌ చేశారు. రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కోట కనిపించేలా లైట్ షో తీర్చిదిద్దారు. 30 ఏళ్ల క్రితమే గోల్కొండ కోటలో సౌండ్‌ అండ్‌ లైట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని హంగులు సమకూర్చారు. వీకెండ్‌లో సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలో తెలుగు, హిందీ , ఇంగ్లీష్‌ భాషల్లో గోల్కొండ చరిత్రను కళ్లకు కడుతారు.

More News

జనసేనకు శుభవార్త.. గాజు గ్లాసు గుర్తును ఖరారుచేసిన సీఈసీ..

ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. గాజు గ్లాసు గుర్తును పార్టీకి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన కేంద్ర కార్యాలయం మెయిల్‌కు

తన కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: సీఎం జగన్

ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల అధ్యక్షురాలు కావడంపై సీఎం జగన్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయం చేస్తోందని తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

జనసేనలో చేరిన సినీ ప్రముఖులు జానీ మాస్టర్, పృథ్వీరాజ్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనసేన పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. మరికొంతమంది సీనియర్ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Raghunandan Rao: కేసీఆర్ కుటుంబంలో గొడవలు.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rajyasabha Elections: టార్గెట్ రాజ్యసభ ఎన్నికలు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధం..

రాజ్యసభ ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్‌ నెలతో ముగియనుంది.