ప్ర‌భాస్ 21కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ దొరికేశాడు!!

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

‘బాహుబ‌లి’ రెండు పార్టులు విడుద‌లైన త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ హీరో నేష‌న‌ల్ రేంజ్‌లో మార్కెట్‌ను పెంచుకున్నాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘బాహుబ‌లి’ త‌ర్వాత వ‌చ్చిన ‘సాహో’ ద‌క్షిణాదిన రాణించ‌క‌పోయినా.. ఉత్త‌రాదిన మాత్రం బాగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ప్ర‌భాస్ 20వ చిత్రం ‘రాధేశ్యామ్‌’ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇది పూర్తి కాగానే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ 21 సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారట‌. నిజానికి బాహుబ‌లి త‌ర్వాత సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రాల‌కు ఆ రేంజ్ ఆడియెన్స్‌ను మెప్పించేలా పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్ట‌ర్ దొర‌క‌లేదు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన నాగ్ అశ్విన్ అండ్ టీమ్ కీర‌వాణిని ఈ సినిమాకు వ‌ర్క్ చేయిస్తున్నాడు. కీర‌వాణి ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కే కాదు.. ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. కావ‌డంతో మ్యూజిక్ ప‌రంగా ప్ర‌భాస్ 21కి స‌మ‌స్య తీరిన‌ట్లే అని అంటున్నారు. దీని త‌ర్వాత ప్ర‌భాస్‌ మ‌రో సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మా‌చారం. టీ సిరీస్ సంస్థ ప్ర‌భాస్‌తో సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. తానాజీ సినిమా ద‌ర్శ‌కుడు ఓం రావ‌త్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఉందని టాక్‌. ఇందులో నిజానిజాలు తెలియాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే.